News March 6, 2025

MNCL: పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయింది: కవిత

image

కరీంనగర్ పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయిందని BRS ఎమ్మెల్సీ కవిత అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు బీసీయేతర అభ్యర్థులను బరిలోకి దింపాయని, పార్టీలపరంగా, సిద్ధాంతపరంగా ఓట్లు చీలాయన్నారు. కాబట్టి పోటీలో ఉన్న బీసీ అభ్యర్థి హరికృష్ణ గెలవలేదని ఆమె అన్నారు. బీసీ రిజర్వేషన్లు ఉంటే ఆ స్థానంలో కచ్చితంగా అన్ని పార్టీలు బీసీకే టికెట్ ఇచ్చేవని వ్యాఖ్యానించారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఉండాలన్నారు.

Similar News

News February 7, 2026

శ్రీ షిర్డీసాయి విద్యాసంస్థల ఆధ్వర్యంలో స్కాలర్‌షిప్ టెస్ట్.!

image

5th నుంచి 9th వరకు చదువుతున్న విద్యార్థులకు శ్రీ షిర్డీసాయి విద్యాసంస్థల ఆధ్వర్యంలో స్కాలర్‌షిప్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ శ్రీవిద్య తెలిపారు. ఈ పరీక్ష ఆదివారం ఉదయం 9.30 గంటలకు రాజమండ్రి ఆల్ బ్యాంక్ కాలనీలోని శ్రీ షిర్డీసాయి విద్యానికేతన్ స్కూల్‌లో జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులందరు సద్వినియోగం చేసుకోవాలని విద్యాసంస్థల ఛైర్మన్ తంబాబత్తుల శ్రీధర్ సూచించారు.

News February 7, 2026

భారత వృద్ధి రేటును పెంచిన గోల్డ్‌మన్ శాక్స్

image

2026 సంవత్సరానికి సంబంధించి భారత రియల్ GDP వృద్ధి రేటు అంచనాను గోల్డ్‌మన్ శాక్స్ 20 బేసిస్ పాయింట్లు పెంచి 6.9%కి సవరించింది. భారత వస్తువులపై టారిఫ్‌లను 25% నుంచి 18%కి తగ్గిస్తూ US నిర్ణయం తీసుకోవడమే ఇందుకు కారణం. దీనివల్ల ఎగుమతులు పెరగడమే కాకుండా, ప్రైవేట్ పెట్టుబడులూ పుంజుకునే అవకాశం ఉందని విశ్లేషించింది. దీంతో రూపాయిపై ఒత్తిడి తగ్గి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని వెల్లడించింది.

News February 7, 2026

నెల్లూరు జిల్లాలో విషాదం

image

కోవూరులో ఇటీవల అపహరణకు గురైన బాలిక చెన్నైలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. అంగడికి వెళ్తున్న బాలికను ఇద్దరు మైనర్లు బైకుపై ఎక్కించుకుని మామిడి తోటలోకి తీసుకెళ్లారు. గుర్తు తెలియని ద్రవం తాగించడంతో బాలిక కోమాలోకి వెళ్లిపోంది. అక్కడి నుంచి ఆ ఇద్దరు యువకులు పారిపోయారు. బాలికను తల్లిదండ్రులు గుర్తించి ఆసుపత్రికి తీసుకెళ్లగా చనిపోయింది. మైనర్లను జువెలైన్ హోంకు తరలించారు.