News April 8, 2025

MNCL: పట్టభద్రుల గొంతుకగా నిలుస్తా: MLC అంజిరెడ్డి

image

ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ఉమ్మడి ఆదిలాబాద్- మెదక్- నిజామాబాద్- కరీంనగర్ గ్రాడ్యుయేట్ బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీగా శాసనమండలిలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, పట్టభద్రుల గొంతుకగా నిలుస్తానని తెలిపారు.

Similar News

News April 18, 2025

ఏప్రిల్ 18: చరిత్రలో ఈరోజు

image

1809: కవి, పండితుడు హెన్రీ డెరోజియా జననం
1880: రచయిత టేకుమళ్ల అచ్యుతరావు జననం
1958: విండీస్ మాజీ క్రికెటర్ మాల్కం మార్షల్ జననం
1859: స్వాతంత్ర్యసమరయోధుడు తాంతియా తోపే మరణం
1955: శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్(ఫొటోలో) మరణం
* ప్రపంచ వారసత్వ దినోత్సవం (అంతర్జాతీయ చారిత్రక కట్టడాల దినోత్సవం)

News April 18, 2025

భూ సమస్యలు లేని రాష్ట్రంగా మార్చేందుకే భూభారతి: ఎమ్మెల్యే కడియం

image

తెలంగాణను భూ సమస్యలు లేని రాష్ట్రంగా మార్చాలన్న లక్ష్యంతోనే భూ భారతి- 2025 చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చినట్లు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. చిల్పూర్ మండల కేంద్రంలోని వరలక్ష్మి గార్డెన్స్‌లో భూ భారతి ఆర్ఆర్- 2025 చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా, అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్‌ పాల్గొన్నారు.

News April 18, 2025

MNCL: ఛత్తీస్‌గఢ్ వెళ్లి దొంగను అరెస్ట్ చేశారు

image

కోర్టుకు గైర్హాజర్ అవుతున్న వ్యక్తిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. టూ టౌన్ ఎస్సై మహేందర్ కేసు వివరాలు వెల్లడించారు. దొంగతనం కేసులో కోర్టుకు రాకుండా తప్పించుకు తిరుగుతున్న హరదీప్ సింగ్‌ను ఛత్తీస్‌గఢ్‌లో పట్టుకొని బెల్లంపల్లి తీసుకొచ్చారు. జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా జైలు శిక్ష విధించారు. అనంతరం ఆసిఫాబాద్ జైలుకు తరలించారు.

error: Content is protected !!