News April 7, 2025

MNCL: పదవ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభం

image

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కార్మెల్ కాన్వెంట్ హైస్కూల్ లో సోమవారం పదవ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. సబ్జెక్టుకు ఒకరు చొప్పున ఏడుగురు అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్స్, 65 మంది చీఫ్ ఎగ్జామినర్స్, 390 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్స్, 130 మంది స్పెషల్ అసిస్టెంట్స్ విధుల్లో చేరగా.. 7,280 పేపర్లు మూల్యాంకనం చేశారు. మూల్యాంకనాన్ని డీఈఓ యాదయ్య పర్యవేక్షించారు.

Similar News

News September 18, 2025

గుంతకల్లుకు నటి నిధి అగర్వాల్

image

ప్రముఖ సినీ నటి నిధి అగర్వాల్ ఈ నెల 22న గుంతకల్లుకు రానున్నారు. ఓ వస్త్ర దుకాణాన్ని ప్రారంభించడానికి ఆమె రానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇక ఇటీవల విడుదలైన ‘హరిహర వీరమల్లు’లో నటించిన ఆమె ప్రస్తుతం ‘ది రాజాసాబ్‌’ మూవీలో ప్రభాస్ సరసన నటిస్తున్నారు.

News September 18, 2025

ASF: ‘అకడమిక్ క్యాలెండర్ ప్రకారం పరీక్షలు నిర్వహించాలి’

image

జిల్లాలో అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఫార్మేటివ్, సమ్మేటివ్ పరీక్షలు నిర్వహించాలని అదనపు కలెక్టర్, ఉమ్మడి జిల్లా పరీక్షల బోర్డు ఛైర్మన్ దీపక్ తివారి అన్నారు. బుధవారం ASF కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు సమావేశానికి హాజరయ్యారు. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఫార్మేటివ్, సమ్మేటివ్ పరీక్షలు నిర్వహించాలని, సీసీఈ నివేదికలు నిర్వహించాలని తెలిపారు.

News September 18, 2025

పీహెచ్‌డీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం: వీసీ

image

యూజీసీ నెట్, జేఆర్‌ఎఫ్, సీఎస్‌ఐఆర్ నెట్ లలో అర్హత సాధించిన అభ్యర్థులకు పీహెచ్‌డీ ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ తెలిపారు. యూనివర్సిటీలో ఫుల్ టైమ్, పార్ట్ టైమ్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసినట్లు బుధవారం ఆమె వెల్లడించారు. ఆసక్తిగల అభ్యర్థులు పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో చూడవచ్చని సూచించారు.