News November 9, 2024
MNCL: పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల

2025 మార్చిలో జరగనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదలైంది. పరీక్ష రుసుం అన్ని సబ్జెక్టులకు రూ.125, మూడు సబ్జెక్టులకు రూ.110, మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులకు రూ.125, వృత్తి విద్యా కోర్సులకు అదనంగా రూ.60 చెల్లించాలని మంచిర్యాల డీఈఓ యాదయ్య తెలిపారు. అపరాధ రుసుం లేకుండా ఈ నెల 18, రూ.50 అపరాధ రుసుంతో డిసెంబర్ 2, రూ.200తో 12వ తేదీ, రూ.500తో 21వ తేదీలోగా చెల్లించాలని సూచించారు.
Similar News
News November 27, 2025
ఎన్నికలకు అవసరమైన బందోబస్తు సిద్ధం: ADB SP

ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అవసరమైన భద్రతా బందోబస్తు ఇప్పటికే సిద్ధం చేస్తున్నామని SP అఖిల్ మహాజన్ తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకునేలా పోలీసు విభాగం సన్నద్ధమైందన్నారు. శాంతియుత ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరి సహకారం అవసరమని తెలిపారు. ప్రజలు రూ.50వేల కంటే ఎక్కువ నగదు తీసుకువెళ్తే తప్పనిసరిగా రసీదులు, డాక్యుమెంట్లు ఉండాలని సూచించారు.
News November 27, 2025
ఎన్నికలను విజయవంతం చేయడం అందరి బాధ్యత: ADB కలెక్టర్

జిల్లాలో జరగనున్న పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు తీసుకుంటున్న ఏర్పాట్లపై రాజకీయ పార్టీలతో సమన్వయం కొనసాగుతుందని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. రాజకీయ పార్టీ నేతలతో గురువారం సమీక్ష నిర్వహించారు. ప్రజాస్వామ్య పండుగలా జరిగే ఈ ఎన్నికలను విజయవంతం చేయడం అందరి బాధ్యత అన్నారు. నామినేషన్ల నుంచి లెక్కింపు వరకు ప్రతి దశలో పారదర్శక విధానాలు అమలు చేస్తామని స్పష్టం చేశారు.
News November 27, 2025
ఆదిలాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలకు సై..!

ఆదిలాబాద్ జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఎన్నికల సందడి నెలకొంది. నేటి (గురువారం) నుంచి తొలి విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. జిల్లాలో మొత్తం 467 గ్రామ పంచాయతీలు, 3,822 వార్డులు ఉన్నాయి. నామినేషన్ల ప్రక్రియ శనివారం వరకు కొనసాగుతుంది. ఈ నెల 30న నామినేషన్లను పరిశీలించి, అర్హత జాబితాను అధికారులు వెల్లడిస్తారు. బరిలో నిలిచేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు.


