News January 30, 2025
MNCL: పదోన్నతుల ద్వారానే పోలీసులకు గుర్తింపు: CP

ఆర్మూడ్ విభాగంలో పనిచేస్తున్న ARకానిస్టేబుల్ లు హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి పొందిన సందర్భంగా అధికారులను సీపీ శ్రీనివాస్ అభినందించారు. పదోన్నతి చిహ్నాలను అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు. CP మాట్లాడుతూ.. పదోన్నతులతోనే పోలీసులకు గుర్తింపు, ఉత్సాహం వస్తుందన్నారు. పోలీస్ శాఖలో పదోన్నతి ద్వారా స్థాయితోపాటు బాధ్యత పెరుగుతుందన్నారు. పెరిగిన బాధ్యతను క్రమశిక్షణయుతంగా నిర్వర్తించాలన్నారు.
Similar News
News December 1, 2025
WNP: ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలి: TPUS

గ్రామపంచాయతీ ఎన్నికల విధుల్లో గర్భిణీ ఉపాధ్యాయులను, చంటి పిల్లల తల్లులను, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, PHC ఉపాధ్యాయులను, రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్న ఉపాధ్యాయులను ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని తపస్ ఆధ్వర్యంలో డీపీఈకి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా అధ్యక్షులు అమరేందర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వరప్రసాద్ గౌడ్ ఉన్నారు.
News December 1, 2025
సిరిసిల్ల: కొత్త యాజమాన్యాలు చేతికి మద్యం దుకాణాలు

రాజన్న సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా మద్యం దుకాణాలు కొత్త యాజమాన్యాల నిర్వహణలోకి వచ్చాయి. Dec 1 నుంచి జిల్లాలోని 48 దుకాణాల నిర్వహణకు గత నెలలో టెండర్లు నిర్వహించగా, టెండర్ దక్కినవారు సోమవారం ఉదయం నుంచి మద్యం విక్రయాలు ప్రారంభించారు. జిల్లాలో చాలా దుకాణాలు కొత్త వ్యాపారులకు దక్కగా, పాతవారికి కొందరికే అవకాశం లభించింది. ఈ క్రమంలో మద్యం వ్యాపారులు వారికి గుడ్విల్ ఇచ్చి తిరిగి దుకాణాలను దక్కించుకున్నారు.
News December 1, 2025
జగిత్యాల: ‘వయోవృద్ధుల డిమాండ్లు తక్షణం నెరవేర్చాలి’

సీనియర్ సిటిజన్స్ డిమాండ్లు త్వరగా పరిష్కరించాలని టాస్కా జగిత్యాల జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. జగిత్యాల టాస్కా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. సీనియర్ సిటిజన్స్ కోసం రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని, ఆర్టీసీ బస్సుల్లో 50% రాయితీ ఇవ్వాలని, హెల్ప్లైన్ను ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు.


