News January 30, 2025
MNCL: పదోన్నతుల ద్వారానే పోలీసులకు గుర్తింపు: CP

ఆర్మూడ్ విభాగంలో పనిచేస్తున్న ARకానిస్టేబుల్ లు హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి పొందిన సందర్భంగా అధికారులను సీపీ శ్రీనివాస్ అభినందించారు. పదోన్నతి చిహ్నాలను అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు. CP మాట్లాడుతూ.. పదోన్నతులతోనే పోలీసులకు గుర్తింపు, ఉత్సాహం వస్తుందన్నారు. పోలీస్ శాఖలో పదోన్నతి ద్వారా స్థాయితోపాటు బాధ్యత పెరుగుతుందన్నారు. పెరిగిన బాధ్యతను క్రమశిక్షణయుతంగా నిర్వర్తించాలన్నారు.
Similar News
News October 16, 2025
వనపర్తి: ‘పోలీస్ విధుల్లో ప్రతిభకు గుర్తింపు’

విధుల్లో సమయపాలన, నిజాయితీ పాటించాలని వనపర్తి జిల్లా ఎస్పీ గిరిధర్ అన్నారు. గురువారం వనపర్తి సాయుధ పోలీస్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న రిజర్వ్ సబ్ఇన్స్పెక్టర్లు వినోద్, బారి తమ బాధ్యతలను సమర్థవంతంగా, నిబద్ధతతో నిర్వర్తించినందుకు నగదు రివార్డులు అందజేశారు. సాయుధ దళాల అదనపు ఎస్పీ వీరారెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
News October 16, 2025
IPS ఆఫీసర్ ఇంట్లో భారీగా నోట్ల కట్టలు

పంజాబ్లోని రోపార్ రేంజ్ DIG, 2009 బ్యాచ్ IPS హర్చరణ్ సింగ్ భుల్లర్ను CBI అరెస్ట్ చేసింది. ₹8లక్షలు లంచం తీసుకుంటూ ఆయన అధికారులకు పట్టుబడ్డారు. హర్చరణ్ ఇల్లు, ఆఫీసులో సోదాలు చేసి ₹5Cr నగదు, 1.5kgs జువెలరీ, 22 లగ్జరీ వాచ్లు, ఆడి, మెర్సిడెస్ కార్లు, గన్స్&పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నారు. అతనితో పాటు మధ్యవర్తినీ అరెస్ట్ చేశారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. రేపు వారిని కోర్టులో హాజరుపరచనున్నారు.
News October 16, 2025
గద్వాల: ‘ఇళ్ల నిర్మాణాలపై పురోగతి సాధించాలి’

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ సంతోష్ అన్నారు. గురువారం గద్వాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఆయన ఎంపీడీవోలతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అంశాలు, వస్తున్న సమస్యలపై క్షుణ్ణంగా విశ్లేషించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇళ్ల నిర్మాణాలపై అధికారులు ప్రత్యేక దృష్టిని పెట్టాలన్నారు.అధికారులు పాల్గొన్నారు.