News March 4, 2025
MNCL: పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంచిర్యాల జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య తెలిపారు. ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగనున్న పరీక్షలకు జిల్లాలో 49 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించడంతో పాటు పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, పరీక్ష కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని సూచించారు.
Similar News
News November 23, 2025
NGKL: వృద్ధురాలితో భూమిపూజ చేయించిన మంత్రి జూపల్లి

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మాచినేనిపల్లిలో మంజూరైన ఇందిరమ్మ ఇంటికి భూమిపూజకు మంత్రి జూపల్లి కృష్ణారావు వెళ్లారు. భర్తను కోల్పోయిన లక్ష్మిదేవమ్మ కుమారుడు పేరుతో ఇల్లు మంజూరు చేశారు. ఆయన భార్య గర్భిణి కావడంతో పూజలో పాల్గొనలేదు. లక్ష్మిదేవమ్మ భూమిపూజ చేయాలని మంత్రి కోరగా ఆమె వితంతువు అని స్థానికులు చెప్పారు. ఇలాంటి సాంఘిక దురాచారాలు నమ్మడం మంచిది కాదని ఆమెతో మంత్రి పూజ చేయించారు.
News November 23, 2025
అనకాపల్లి: ఈనెల 24 నుంచి రైతు వారోత్సవాలు

ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఈనెల 24 నుంచి 29 వరకు రైతు వారోత్సవాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్లు
అనకాపల్లి జిల్లా వ్యవసాయ అధికారి ఎం.ఆశాదేవి ఆదివారం తెలిపారు. దీని ద్వారా ప్రతి రైతు ఇంటికి వెళ్లి వ్యవసాయ సిబ్బంది అవగాహన కల్పిస్తారని అన్నారు. ప్రతి 3 రైతు కుటుంబాలను ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసి రోజుకి 30 క్లస్టర్ల (90 కుటుంబాలు)కు చెందిన రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు.
News November 23, 2025
స్మృతి మంధాన పెళ్లి వేదిక వద్దకు అంబులెన్స్.. పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్!

భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన, మ్యూజిక్ కంపోజర్ పలాశ్ ముచ్చల్ పెళ్లి వేదిక వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. వేడుకలకు హాజరైన అతిథికి గుండెపోటు రావడంతో అంబులెన్స్లో సాంగ్లీలోని సర్వ్హిత్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడి వివరాలు తెలియనప్పటికీ పెళ్లి పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనిపై ఈవెంట్ ఆర్గనైజర్లు, కుటుంబ సభ్యులు ఇంకా స్పందించలేదు.


