News March 4, 2025
MNCL: పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంచిర్యాల జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య తెలిపారు. ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగనున్న పరీక్షలకు జిల్లాలో 49 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించడంతో పాటు పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, పరీక్ష కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని సూచించారు.
Similar News
News March 15, 2025
సూపర్ ప్లాన్: ఈ రీఛార్జ్తో 365 రోజులు..

తక్కువ ఖర్చుతో ఎక్కువ రోజులు సిమ్ యాక్టివ్గా ఉండాలనుకునే యూజర్ల కోసం BSNL మంచి ప్లాన్ అందిస్తోంది. రూ.1,198తో రీఛార్జ్ (రోజుకు రూ.3.28) చేస్తే 365 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది. ప్రతి నెలా 300 నిమిషాల వరకు ఏ నెట్వర్క్కైనా ఉచిత కాలింగ్, 30 ఫ్రీ SMSలతో పాటు నెలకు 3GB డేటా వస్తుంది. దేశమంతటా రోమింగ్ సమయంలో ఉచిత ఇన్కమింగ్ కాల్స్ పొందొచ్చు. BSNLను సెకండ్ సిమ్గా ఉపయోగించేవారికి ఇది బెస్ట్ ప్లాన్.
News March 15, 2025
SKLM: ‘స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాలు అమలు చేయాలి’

స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని జిల్లా ఇన్ ఛార్జ్ అధికారి శశిభూషణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులతో శనివారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ జేసీ ఫర్మాన్ అహ్మద్లతో కలిసి సమీక్షించారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ జిల్లా ఇన్ఛార్జి అధికారి శశిభూషణ్ కుమార్కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా వివరాలను తెలియజేశారు.
News March 15, 2025
జనగామ: రిజర్వాయర్ నుంచి నీటి విడుదల

నర్మెట్ట మండలం బొమ్మకూరు రిజర్వాయర్ ఎడమ, కుడి కాలువల నుంచి నీటిని విడుదల చేస్తున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా కుడి కాలువ ద్వారా జనగామ మరియు బచ్చన్నపేట మండలం పరిధిలోని పలు గ్రామాలలో 15000 ఎకరాలకు, అదేవిధంగా ఎడమ కాలువ ద్వారా నర్మెట మరియు రఘునాథపల్లి మండలం పరిధిలోని పలు గ్రామాలలో 6000 ఎకరాలకు నీటిని విడుదల చేశారు.