News February 1, 2025

MNCL: పదో తరగతి ఫలితాల్లో ఉత్తమంగా నిలవాలి: DEO

image

పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి జిల్లాను రాష్ట్రంలో ముందు వరుసలో ఉంచేలా కృషి చేయాలని మంచిర్యాల డీఈఓ యాదయ్య సూచించారు. శుక్రవారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, కేజీబీవీ ఎయిడెడ్, తెలంగాణ ఆదర్శ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఫిబ్రవరి నెలలో నిర్వహించే గ్రాండ్ టెస్ట్, మార్చిలో నిర్వహించే ప్రీ ఫైనల్ పరీక్షలకు విద్యార్థులను సంసిద్ధులను చేయాలన్నారు.

Similar News

News September 14, 2025

ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం విఫలం: YCP

image

AP: విజయవాడ న్యూరాజరాజేశ్వరిపేటలోని డయేరియా బాధితులను YCP నిజనిర్ధారణ కమిటీ పరామర్శించింది. మల్లాది విష్ణు, దేవినేని అవినాశ్, మొండితోక జగన్మోహన్ తదితరులు బాధితులతో మాట్లాడారు. ‘న్యూరాజరాజేశ్వరిపేటలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి. డోర్‌2డోర్ సర్వే చేసి బాధితుల వివరాలు సేకరించాలి. డ్రైనేజీ, పారిశుద్ధ్య వ్యవస్థలను మెరుగుపరచాలి. మెడికల్ క్యాంపుల ద్వారా వారికి భరోసా ఇవ్వాలి’ అని వారు పేర్కొన్నారు.

News September 14, 2025

HYD: పొలిటికల్ డ్రామా.. ఓవర్ టూ అసెంబ్లీ

image

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారిన MLAల భవిత నేడు కీలక మలుపు తీసుకోనుంది. ‘పార్టీ మార్పు’పై ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణపై బీఆర్ఎస్ నాయకులు ఈ రోజు అసెంబ్లీలో స్పీకర్‌కు తమ అభిప్రాయం చెప్పబోతున్నారు. మధ్యాహ్నం అసెంబ్లీ కార్యదర్శితో BRS నాయకులు సమావేశం కానున్నారు. వారిచ్చే రియాక్షన్‌ను బట్టి స్పీకర్ చర్యలు తీసుకోబోతున్నారు. ఈ తాజా రాజకీయ పరిణామాలతో నగరంలో పోలిటికల్ హీట్ మొదలైంది.

News September 14, 2025

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు

image

శనివారం సాయంత్రం 5 గంటల వరకు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 12 గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టులోకి 1,12,226 క్యూసెక్కుల వరద నీరు భారీగా చేరుతోంది. ప్రాజెక్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మొత్తం 148.00 మీటర్ల నీటిమట్టం ఉండాల్సిన ప్రాజెక్టులో ప్రస్తుతం 147.81 మీటర్ల వద్ద నీటిమట్టం కొనసాగుతోంది. 20.175 టీఎంసీల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 19.6475టీఎంసీల నీరు నిల్వ ఉంది.