News February 1, 2025
MNCL: పదో తరగతి ఫలితాల్లో ఉత్తమంగా నిలవాలి: DEO

పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి జిల్లాను రాష్ట్రంలో ముందు వరుసలో ఉంచేలా కృషి చేయాలని మంచిర్యాల డీఈఓ యాదయ్య సూచించారు. శుక్రవారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, కేజీబీవీ ఎయిడెడ్, తెలంగాణ ఆదర్శ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఫిబ్రవరి నెలలో నిర్వహించే గ్రాండ్ టెస్ట్, మార్చిలో నిర్వహించే ప్రీ ఫైనల్ పరీక్షలకు విద్యార్థులను సంసిద్ధులను చేయాలన్నారు.
Similar News
News November 23, 2025
త్వరలో జిల్లా అంతటా పర్యటిస్తా: జీవన్ రెడ్డి

త్వరలో నిజామాబాద్ జిల్లా అంతటా పర్యటించి,స్థానిక పోరుకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తానని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఆపద కాలంలో పార్టీ కోసం పోరాడుతున్న గులాబీ శ్రేణులకు పాదాభివందనం చేస్తున్నానని అన్నారు. ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను గ్రామగ్రామాన ఎండగడతామని అన్నారు.
News November 23, 2025
మహబూబాబాద్ బిడ్డకు గోల్డ్ మెడల్

మహబూబాబాద్ జిల్లా కురవి మండలం జాటోత్ తండాకు చెందిన క్రీడాకారిణి గుగులోతు ప్రియ ఒడిశాలో జరిగిన ఈఎంఆర్ఎస్ 4వ జాతీయ టైక్వాండో పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించింది. పలు రాష్ట్రాల నుంచి వచ్చి పోటీ పడిన క్రీడాకారులను ఎదుర్కొని స్వర్ణ పతకంతో రాష్ట్రానికి పేరు తెచ్చిన ప్రియను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఆమెకు ప్రశంసా పత్రాన్ని అందజేసిన సీఎం.. భవిష్యత్తులో మరిన్ని పథకాలను సాధించాలని ప్రోత్సహించారు.
News November 23, 2025
సిద్దిపేట: 25న వాడిన సామాగ్రి వేలంపాట

వాడిన ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ వస్తువులు, బ్యాటరీలు, టెంట్లు ఇతర సామాగ్రికి 25న జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ (పెద్ద కోడూరు శివారు)లో వేలంపాట వేస్తున్నట్టు సీపీ విజయ్ కుమార్ పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు వేలం పాట ప్రారంభమవుతుందని తెలిపారు. వేలం పాటలో పాల్గొనాలని ఆసక్తి ఉన్నవారు వేలంపాట ప్రదేశానికి వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. సందేహాలకు 87126 67416, 87126 67422 సంప్రదించాలన్నారు.


