News March 9, 2025
MNCL: పద్మ కుమార్కు ఉత్తమ మహిళా-ధాత్రి రత్న సేవా అవార్డు

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కల్వరి యువశక్తి అనాధ ఆశ్రమం ప్రధాన కార్యదర్శి పద్మ కుమార్కు ఉత్తమ మహిళా-ధాత్రి రత్న సేవ అవార్డులు వరించింది. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని సారస్వత పరిషత్లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్. ప్రియా చౌదరి ఆమెకు అవార్డు ప్రదానం చేశారు. సమాజానికి అందిస్తున్న విశేష సేవలకు పద్మ కుమార్కు పురస్కారం అందజేశారు.
Similar News
News November 5, 2025
జనాభా గణనకు సిద్ధం కావాలి: డైరెక్టర్ జె.నివాస్

భారతదేశ జనాభా గణన – 2027లో నమోదయ్యేందుకు ప్రజలు సిద్ధం కావాలని రాష్ట్ర జన గణన డైరెక్టర్ జె.నివాస్ పేర్కొన్నారు. బుధవారం ఆయన భీమిలి మండలం ప్రజా పరిషత్, జీవీఎంసీ జోనల్ కార్యాలయంలోనూ ఇండ్ల గణన పై PRE -TEST (ముందస్తు పరీక్ష) కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర జన గణన డైరెక్టర్ అధ్యక్షతన జీవీఎంసీ అదనపు కమిషనర్ డి.వి.రమణమూర్తి ఎన్యూమ్ రేటర్లకు, సూపర్వైజర్లకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.
News November 5, 2025
కోటిలింగాలలో గోదావరికి మహా హారతి

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాలలోని ప్రాచీన కోటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం సాయంత్రం గోదావరి మహా హారతి కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గోదావరి తీరం దీపాలతో కళకళలాడగా, అర్చకులు వైదిక మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు చేపట్టారు. స్థానిక భక్తులు, మహిళా సంఘాలు, సేవా సంస్థల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి సంకీర్తనలతో గోదావరికి దీపాలు సమర్పించారు. శివయ్య నామస్మరణలు చేశారు.
News November 5, 2025
ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలు త్వరగా పరిష్కరిస్తాం: కలెక్టర్

కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, మెడికల్ కాలేజీ సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి తెలిపారు. బుధవారం సాయంత్రం మెడికల్ కాలేజీ సమావేశ మందిరంలో అన్ని వైద్య విభాగాల అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. వైద్య పరికరాలు, సిబ్బంది నియామకాలు, వసతుల మెరుగుదల కోసం చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రి టీజీ భరత్ సహకారంతో సమస్యలను పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు.


