News March 21, 2025

MNCL: పరీక్షకు 20 మంది గైర్హాజరు

image

మంచిర్యాల జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. డీఈఓ యాదయ్య తెలిపారు. 49 పరీక్షా కేంద్రాల్లో రెగ్యూలర్ విద్యార్థులు 9,183 మందికి గాను 9,163 మంది హాజరయ్యారని, 20 మంది గైర్హాజరైనట్లు వెల్లడించారు. సప్లీలు రాసే ఆరుగురు విద్యార్థులకు ఇద్దరు హాజరయ్యారు. కాగా అన్ని పరీక్షా కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేశామన్నారు.

Similar News

News February 27, 2026

రేపు ఆకాశంలో అద్భుతం.. ఆరు గ్రహాల పరేడ్

image

ఎన్నో అద్భుతాలకు నిలయమైన ఆకాశంలో రేపు మరో మిరాకిల్ జరగనుంది. బృహస్పతి, బుధుడు, యురేనస్, నెప్ట్యూన్, శుక్రుడు, శని ఒకే వరుసలో కనువిందు చేయనున్నాయి. దీనిని గ్రహాల పరేడ్‌గా సైంటిస్టులు పేర్కొంటున్నారు. సూర్యాస్తమయం తర్వాత ఆకాశం స్పష్టంగా ఉంటే పశ్చిమం వైపున బుధుడు, శుక్రుడు, బృహస్పతి, శని గ్రహాలను నేరుగా చూడవచ్చు. యురేనస్, నెప్ట్యూన్‌లను బైనాక్యులర్లు/టెలిస్కోప్‌తో వీక్షించవచ్చు.

News February 27, 2026

ఒకే వరుసలోకి గ్రహాలు.. ఇలా సాధ్యం

image

సౌర వ్యవస్థలో ప్రధానంగా 8 గ్రహాలున్నాయి. సూర్యుడి చుట్టూ ఓసారి తిరగడానికి బుధుడికి 88D, శుక్రుడికి 225D, భూమికి 365D, అంగారకుడికి 687D, జూపిటర్‌కి 12 ఎర్త్ ఇయర్స్, శనికి 29.5EY, యురేనస్‌కి 84EY, నెప్ట్యూన్‌కు 165EY పడుతుంది. వాటి వేగాలు, దూరాలను బట్టి కొన్ని గ్రహాలు అరుదుగా ఒకే వరుసలోకి వస్తాయి. 2 లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు సూర్యుని వరుసలోకి రావడాన్ని సిజిగీ అంటారు.
* ఒక ఎర్త్ ఇయర్= 365 D

News February 27, 2026

తిరుపతిలో గరుడ వారధిపై యువకుడి మృతి

image

తిరుపతిలో గరుడ వారధిపై మరొకరు చనిపోయారు. తాతయ్యగుంటకు చెందిన ఆదం ద్వారక(23) తిరుచానూరులో జరిగిన వివాహానికి వెళ్లాడు. మరొకరితో కలిసి బైకుపై తిరిగి వస్తుండగా.. బ్లిస్ సర్కిల్ సమీపంలో గరుడ వారధిపై బైక్ అదుపుతప్పి గోడను ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన ద్వారక స్పాట్‌లోనే చనిపోయాడు. స్వల్ప గాయాలతో బయటపడిన మరో యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ హేమాద్రి కేసు దర్యాప్తు చేస్తున్నారు.