News March 2, 2025

MNCL: పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: డీఈవో

image

జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని మంచిర్యాల డీఈఓ యాదయ్య సూచించారు. శనివారం ఎంఈఓలు, చీఫ్ సూపరింటెండెంట్లు, డెపార్ట్మెంట్ అధికారులు, రూట్ అధికారులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు జరుగుతాయని, పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు.

Similar News

News February 26, 2026

క్షేత్రస్థాయిలో రైతులకు పథకాలు అమలు చేయాలి: కలెక్టర్

image

పీఎం ధన ధాన్య కృషి యోజన అమలుపై గురువారం కేంద్ర అధికారి సిద్ధార్థ జైన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. పుట్టపర్తి కలెక్టర్‌లో కలెక్టర్‌తో పాటు వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో రైతులకు పథకాలు మరింత చేరువ చేయాలన్నారు. ఆధునిక సాగు పద్ధతులపై దృష్టి సారించాలని, చియా పంటను జిల్లా అంతట విస్తరింపజేయాలని, కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

News February 26, 2026

53 డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో రూ.5.30 లక్షల జరిమానా: VZM ఎస్పీ

image

మద్యం తాగి వాహనాలు నడిపిన 53 మంది వాహనదారులపై కేసులు నమోదు చేసి, ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.5.30 లక్షల జరిమానా విధించినట్లు SP దామోదర్ గురువారం తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి నిందితులను మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా జరిమానా విధించబడిందన్నారు. గడిచిన 3 నెలల్లో మద్యం మత్తులో వాహనాలు నడిపిన సుమారు 110 మందికి జైలు శిక్ష పడిందని ఎస్పీ వెల్లడించారు.

News February 26, 2026

జగిత్యాలలో ఐదు నెలల ఉచిత ఫౌండేషన్ కోర్సుకు ప్రవేశ పరీక్ష

image

తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఐదు నెలల ఫౌండేషన్ కోర్సు ఉచిత శిక్షణకు ప్రవేశ పరీక్షను మార్చి 1న నిర్వహించనున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కె.రాజ్ కుమార్ తెలిపారు. ఈ పరీక్ష జగిత్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు జరుగుతుందన్నారు. అభ్యర్థులు గంటముందే గుర్తింపు పత్రాలతో హాజరుకావాలన్నారు.