News March 23, 2025
MNCL: పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పరీక్షా కేంద్రాలను సందర్శించారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు తాగునీరు, విద్యుత్ సరఫరాతో పాటు ఆర్టీసీ బస్సులు, ప్రశ్న, జవాబు పత్రాల రవాణా, బందోబస్తు, పారిశుద్ధ్యం, అత్యవసర వైద్య సేవలకు వైద్య సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు.
Similar News
News December 3, 2025
అన్నమయ్య జిల్లాలో తాత్కాలిక అకాడమిక్ చాత్రోపాధ్యాయ నియామకాలు

అన్నమయ్య జిల్లా 17 మండలాల్లో 48 పాఠశాలల్లో D.Ed./ B.Ed. పూర్తి చేసిన అభ్యర్థులను 2025-26 విద్యా సంవత్సరానికి 5 నెలల వ్యవధికి తాత్కాలిక అకాడమిక్ చాత్రోపాధ్యాయగా నియమించేందుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. అర్హతగల అభ్యర్థులు తమ దరఖాస్తులను 5వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు మండల విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలని DEO సుబ్రహ్మణ్యం తెలిపారు.
News December 3, 2025
మోరంపూడి ఫ్లైఓవర్ కింద గుర్తుతెలియని వ్యక్తి మృతి

మోరంపూడి ఫ్లైఓవర్ కింద బుధవారం 30-35 సంవత్సరాల వయస్సు కలిగిన గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడని బొమ్మూరు పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ పి.కాశీవిశ్వనాథం ఒక ప్రకటనలో తెలిపారు. సదరు వ్యక్తి మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించామన్నారు. మృతిచెందిన వ్యక్తి ఆచూకీ తెలిసినవారు బొమ్మూరు పోలీస్స్టేషన్ 94407 96533 నంబరులో సంప్రదించాలని ఆయన కోరారు.
News December 3, 2025
ADB: CM సభ.. కలెక్టర్, SP నిరంతర పర్యవేక్షణ

ఆదిలాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ అప్రమత్తయ్యారు. సీఎం సభ ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తూ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. బుధవారం సాయంత్రం ఇందిరాప్రియదర్శిని స్టేడియంలో ఎస్పీతో కలిసి కలెక్టర్ ఏర్పాట్లను పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు.


