News March 23, 2025
MNCL: పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పరీక్షా కేంద్రాలను సందర్శించారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు తాగునీరు, విద్యుత్ సరఫరాతో పాటు ఆర్టీసీ బస్సులు, ప్రశ్న, జవాబు పత్రాల రవాణా, బందోబస్తు, పారిశుద్ధ్యం, అత్యవసర వైద్య సేవలకు వైద్య సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు.
Similar News
News April 25, 2025
ఖమ్మం: భానుడి ప్రతాపం.. ఈ మండలాల్లోనే అధికం

ఖమ్మం జిల్లాలో గురువారం నమోదైన ఉష్ణోగ్రతల వివరాలను వాతావరణ శాఖ వెల్లడించింది. మధిరలో 43.1, KMM(U) ఖానాపురం PS 42.9, కారేపల్లి, కామేపల్లి (లింగాల) 42.8, ముదిగొండ(పమ్మి), సత్తుపల్లి 42.7, రఘునాథపాలెం 42.6, పెనుబల్లి 42.5, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం(బచ్చోడు) 42.0, కూసుమంచి 41.9, వైరా 41.8, వేంసూరు, కల్లూరు 41.6, ఎర్రుపాలెం 41.5, కొణిజర్ల, ఏన్కూరు 41.0, KMM (R) పల్లెగూడెంలో 40.3 డిగ్రీలు నమోదైంది.
News April 25, 2025
MNCL: వడదెబ్బకు ఏడుగురి మృతి

ఉమ్మడి ADB జిల్లా అగ్నిగుండంలా మారింది. రోజురోజుకు పెరుగుతున్న ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొన్ని మండలాల్లో 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వారం రోజుల్లో నిర్మల్ జిల్లాలో ముగ్గురు, మంచిర్యాల జిల్లాలో ఇద్దరు, ఆసిఫాబాద్లో ఒకరు, ఆదిలాబాద్లో ఒకరు చొప్పున మృతిచెందారు. అనధికారికంగా సంఖ్యల ఎక్కువే ఉండొచ్చు. జాగ్రత్తలు పాటించండి. బయట తిరగొద్దు. నీరు అధికంగా తాగండి.
News April 25, 2025
MNCL: విలేకరుల ముసుగులో దందా.. ఇద్దరి అరెస్ట్

విలేకరుల ముసుగులో మత్తు పదార్థాల దందా చేస్తున్న నిందితులను జిల్లా టాస్క్ఫోర్స్ ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. CI సమ్మయ్య కథనం ప్రకారం.. తాండూరు మండలం జాతీయ రహదారి వద్ద ప్రెస్స్టిక్కర్ అంటించిన టాటా ఇండికా కారును తనిఖీ చేశారు. కారులో 216 కిలోల బెల్లం, 30 కిలోల పటిక పట్టుబడ్డాయి. వాటిని స్వాధీనం చేసుకొని రాజ్ కుమార్, సంజులను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు చందు పరారీలోఉన్నాడు.