News March 23, 2025
MNCL: పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పరీక్షా కేంద్రాలను సందర్శించారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు తాగునీరు, విద్యుత్ సరఫరాతో పాటు ఆర్టీసీ బస్సులు, ప్రశ్న, జవాబు పత్రాల రవాణా, బందోబస్తు, పారిశుద్ధ్యం, అత్యవసర వైద్య సేవలకు వైద్య సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు.
Similar News
News July 5, 2025
దారుణం: కత్తితో పొడిచి.. తాళి కట్టి.. సెల్ఫీ దిగి

కర్ణాటకలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. రక్తపు మడుగులో పడి ఉన్న యువతికి తాళి కట్టాడు. మైసూర్కు చెందిన పూర్ణిమ (36) టీచర్. అభిషేక్ ప్రేమ పేరుతో ఆమె వెంటపడేవాడు. ఇవాళ ఆమెను కత్తితో పొడిచాడు. యువతి స్పృహ తప్పి కిందపడిపోగానే మెడలో తాళి కట్టాడు. ఆపై సెల్ఫీ తీసుకుని మురిసిపోయాడు. తర్వాత అతడే ఆస్పత్రికి తరలించాడు. పరిస్థితి విషమించడంతో పారిపోయాడు. పూర్ణిమ చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలింది.
News July 5, 2025
అనకాపల్లి జిల్లాలో TODAY TOP NEWS

➤ రేపు ఉపమాక గరుడాద్రి పర్వతం చుట్టూ గిరిప్రదక్షిణ
➤ జలాశయాల్లో చేపలవేటకు నిషేధం
➤ అభివృద్ధి సూచికపై శిక్షణలో పాల్గొన్న ఎంపీడీవోలు
➤ పోలవరం ప్రాజెక్టు డివిజన్ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సుందరపు
➤ స్మార్ట్ మీటర్లను పగలగొట్టి నిరసన తెలిపిన సీపీఐ
➤ మాడుగుల డిగ్రీ కళాశాల విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
➤ గురుజాపాలెంలో ఆటిజం శిక్షణా కేంద్రం ఏర్పాటు
News July 5, 2025
వచ్చే జూన్ నాటికి వెలిగొండ పూర్తి చేయాలి: సీఎం

AP: 2026 జూన్ నాటికి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్లివ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. జలవనరుల శాఖపై సమీక్షించిన సీఎం.. ఈ నెల 15న హంద్రీనీవా మెయిన్ కెనాల్ ద్వారా జీడిపల్లి జలాశయానికి నీటిని విడుదల చేయాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రధాన రిజర్వాయర్లలో 419 టీఎంసీల మేర నీటి నిల్వలు ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు. రానున్న రోజుల్లో కురిసే వర్షాలతో అవి మరింత పెరుగుతాయన్నారు.