News March 1, 2025

MNCL: పోలీస్ కమిషనరేట్‌కు 3 జాగిలాలు

image

రామగుండం పోలీస్ కమిషనరేట్‌కు శనివారం 3 జాగిలాలు వచ్చాయి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో ఏడాది పాటు శిక్షణ పొందిన 24వ బ్యాచ్‌‌కు చెందిన 3 జాగిలాలు పాసింగ్ ఔట్ పూర్తి చేసుకొని కమిషనరేట్‌కు వచ్చాయి. నేరాల నియంత్రణ, నార్కోటిక్, ఎక్స్‌ప్లోజివ్స్ గుర్తింపులో పోలీస్ జాగీలాల పాత్ర కీలకమని సీపీ శ్రీనివాస్ పేర్కొన్నారు.

Similar News

News December 4, 2025

రాష్ట్రంలో 134 బోధనా ప్రయోగశాలలు: MP

image

రాష్ట్రంలో 134 బోధనా ప్రయోగశాలల ఏర్పాటు కేంద్ర పరిశీలనలో ఉందని కాకినాడ MP తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. బుధవారం పార్లమెంటులో తానడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ సమాధానం ఇచ్చారని వెల్లడించారు. నేషనల్ క్వాంటం మిషన్ ద్వారా వీటి ఏర్పాటు పరిశీలిస్తున్నారన్నారు. తిరుపతి ఐఐటీకి రూ.25.28 కోట్లు ఇప్పటికే మంజూరైనట్లు మంత్రి తెలిపారని ఎంపీ వెల్లడించారు.

News December 4, 2025

డాలర్.. 12 లక్షల రియాల్స్‌!

image

ఇరాన్ కరెన్సీ విలువ దారుణంగా పడిపోయింది. ఓ డాలర్‌ 12 లక్షల రియాల్స్‌కు సమానమైంది. ఫలితంగా నిత్యవసరాల ధరలు పెరిగాయి. అణ్వస్త్ర కార్యక్రమాల వల్ల ఇరాన్‌పై అంతర్జాతీయ ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో కొన్నేళ్లుగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారుతోంది. అటు ఆ దేశంలో పవర్‌ గ్రిడ్‌ల వైఫల్యం వల్ల గంటలపాటు విద్యుత్‌కు అంతరాయం ఏర్పడి ప్రజలు అల్లాడుతున్నారు. 2015లో ఓ డాలర్‌ 32 వేల రియాల్స్‌కు సమానంగా ఉండేది.

News December 4, 2025

MHBD: ‘గుర్తులు’ వచ్చే వరకు మమ్మల్ని కాస్త ‘గుర్తు’ పెట్టుకోండి..!

image

MHBD జిల్లాలో మొదటి, 2వ విడత ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. గ్రామాల్లో ఎన్నికల వేడి పెరిగి ప్రచార జోరు సాగుతోంది. ఆయా గ్రామాల్లో ఉదయం నుంచే అభ్యర్థులు ఓటర్ల ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు వెయ్యాలని అభ్యర్థిస్తున్నారు. గుర్తులు ఇంకా కేటాయించకున్నా ప్రచారం నిర్వహిస్తున్నారు. ‘గుర్తులు వచ్చే దాక తమని గుర్తుంచుకోవాలని ఓటర్లను వేడుకుంటున్నారు. గ్రామాలల్లో పోటాపోటీ రాజకీయం మొదలైంది.