News March 1, 2025

MNCL: పోలీస్ కమిషనరేట్‌కు 3 జాగిలాలు

image

రామగుండం పోలీస్ కమిషనరేట్‌కు శనివారం 3 జాగిలాలు వచ్చాయి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో ఏడాది పాటు శిక్షణ పొందిన 24వ బ్యాచ్‌‌కు చెందిన 3 జాగిలాలు పాసింగ్ ఔట్ పూర్తి చేసుకొని కమిషనరేట్‌కు వచ్చాయి. నేరాల నియంత్రణ, నార్కోటిక్, ఎక్స్‌ప్లోజివ్స్ గుర్తింపులో పోలీస్ జాగీలాల పాత్ర కీలకమని సీపీ శ్రీనివాస్ పేర్కొన్నారు.

Similar News

News March 18, 2025

సత్యసాయి: ‘ఆధార్ నమోదులో తప్పులు దొర్లరాదు’

image

ఆధార్ నమోదులో ఎలాంటి తప్పులు జరగకూడదని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టర్ కార్యాలయంలో ఆధార్ నమోదుపై జిల్లా కమిటీతో సమావేశం నిర్వహించారు. ఐదేళ్లలోపు పిల్లలకు వైద్య ఆరోగ్యశాఖ, ఐసీడీఎస్, జిఎస్‌డబ్ల్యూ, పోస్టల్ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న ఆధార్ కేంద్రాలలో నమోదు చేయాలని సూచించారు.

News March 18, 2025

విశాఖ మేయర్ పీఠాన్ని కాపాడుకుంటాం: కన్నబాబు

image

AP: విశాఖ మేయర్ పీఠంపై <<15799147>>కూటమి కన్నేయడంతో<<>> వైసీపీ అప్రమత్తమైంది. ఇవాళ కార్పొరేటర్లతో ఉత్తరాంధ్ర సమన్వయకర్త కన్నబాబు సమావేశయ్యారు. ఈ భేటీకి 34 మంది హాజరుకాగా, ముగ్గురు రాలేదు. తమ కార్పొరేటర్లను ప్రలోభపెడుతున్నారని ఆయన మండిపడ్డారు. మేయర్ స్థానాన్ని కాపాడుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. చీప్ పాలిటిక్స్ మానుకోవాలని CBNకు మాజీ మంత్రి అమర్నాథ్ హితవు పలికారు.

News March 18, 2025

రన్యారావు కేసులో వెలుగులోకి కీలక విషయాలు

image

బంగారం స్మగ్లింగ్ చేస్తూ అరెస్టైన కన్నడ నటి రన్యారావు కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె తన స్నేహితుడు తరుణ్ రాజుతో 26 సార్లు దుబాయ్‌ వెళ్లినట్లు, ఆ సమయంలోనూ స్మగ్లింగ్ చేసినట్లు DRI కోర్టు విచారణలో పేర్కొంది. ఆ సమయంలో వీరిద్దరూ ఉదయం బయలుదేరి సాయంత్రం తిరిగొచ్చేవారంది. దుబాయ్‌లో రాజు ఆర్థిక లావాదేవీలను అధికారులు పరిశీలిస్తున్నట్లు, అతనికి లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు వివరించింది.

error: Content is protected !!