News February 11, 2025
MNCL: ప్రతి పోలీస్ స్టేషన్లో సైబర్ వారియర్లు: CP

సైబర్ నేరాల కట్టడిపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TSCSB) ఆదేశాల మేరకు కమిషనరేట్లో ప్రత్యేక దృష్టి సారించినట్లు జరిగిందని శ్రీనివాస్ పేర్కొన్నారు. CP మాట్లాడుతూ.. సైబర్ నేరానికి గురైతే కంగారు పడకుండా ఫోన్ కాల్ చేస్తే సైబర్ వారియర్ అందుబాటులోకి వస్తారన్నారు. సైబర్ వారియర్స్ 1930ఫోనులో ఫిర్యాదులను స్వీకరిస్తారన్నారు. నేరాన్ని నివేదించడం, అనుమానిత ఐడెంటిఫైయర్లను విశ్లేషించడం జరుగుతుందన్నారు.
Similar News
News January 7, 2026
సీఎం పర్యటన.. డ్రోన్ల నిఘా.. ఖాకీల పహారా!

పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో బుధవారం పోలీస్ అధికారులు గట్టి భద్రత చర్యలు చేపట్టారు. కలెక్టర్ వెట్రి సెల్వి,రేంజ్ ఐజీ అశోక్ కుమార్, ఎస్పీ ప్రతాప్ కిషోర్ యంత్రాంగానికి పలు సూచనలు చేశారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా అత్యాధునిక సీసీ, డ్రోన్ కెమెరాల పనితీరును పర్యవేక్షించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ ఆంక్షలు విధించి, ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు.
News January 7, 2026
RARE: పర్ఫెక్ట్ ఫిబ్రవరి.. గమనించారా?

వచ్చే ఫిబ్రవరి నెలను ‘పర్ఫెక్ట్ ఫిబ్రవరి’గా నెటిజన్లు అభివర్ణిస్తున్నారు. ఆ నెల ఆదివారంతో మొదలై సరిగ్గా 28 రోజులు పూర్తి చేసుకుని శనివారంతో ముగియనుంది. అంటే ఎక్కడా మిగిలిపోకుండా కచ్చితంగా 4 వారాల కాలచక్రాన్ని కలిగి ఉండటం విశేషం. చివరిసారిగా 2015లో ఇలానే జరిగింది. క్యాలెండర్లో నెలంతా ఒక క్రమ పద్ధతిలో సెట్ అవ్వడంతో దీనిపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మీరూ ఇది గమనించారా? COMMENT
News January 7, 2026
KNR: ఉమ్మడి జిల్లాలో పెరిగిన చలి.. ఆరెంజ్ అలర్ట్ జారీ

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చలి తీవ్రత భారీగా పెరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గజసింగారంలో కనిష్ఠ ఉష్ణోగ్రత 9.9℃గా నమోదు కావడంతో వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అటు పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ములకాలపల్లిలో 10.1℃, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నెరేళ్లలో 10.3℃, కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఆసిఫ్నగర్లో 10.6℃ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


