News February 11, 2025
MNCL: ప్రతి పోలీస్ స్టేషన్లో సైబర్ వారియర్లు: CP

సైబర్ నేరాల కట్టడిపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TSCSB) ఆదేశాల మేరకు కమిషనరేట్లో ప్రత్యేక దృష్టి సారించినట్లు జరిగిందని శ్రీనివాస్ పేర్కొన్నారు. CP మాట్లాడుతూ.. సైబర్ నేరానికి గురైతే కంగారు పడకుండా ఫోన్ కాల్ చేస్తే సైబర్ వారియర్ అందుబాటులోకి వస్తారన్నారు. సైబర్ వారియర్స్ 1930ఫోనులో ఫిర్యాదులను స్వీకరిస్తారన్నారు. నేరాన్ని నివేదించడం, అనుమానిత ఐడెంటిఫైయర్లను విశ్లేషించడం జరుగుతుందన్నారు.
Similar News
News November 11, 2025
భీమవరం: ‘మా అమ్మ, తమ్ముడు దెయ్యాలు’.. నిందితుడి వీడియో వైరల్

భీమవరంలో తల్లి, తమ్ముడిని దారుణంగా గంట పాటు <<18246456>>పొడిచి చంపిన<<>> తర్వాత శ్రీనివాస్ రోడ్డుపైకి వచ్చి మాట్లాడిన మాటలు భయబ్రాంతులకు గురి చేశాయి. ‘మా అమ్మ, తమ్ముడు మనుషులు కాదు దెయ్యాలు. నన్ను పీక్కుతింటున్నారు. వాళ్ల కడుపులో ఎన్నిసార్లు పొడిచినా చావట్లేదు. నా మనసులో ఏం అనుకున్నా వాళ్లకు తెలిసిపోతోంది. నాకు పిచ్చి అంటున్నారు’ అని చెప్పడం భయం కలిగించింది. కాగా అతని మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు తేల్చారు.
News November 11, 2025
నాయుడుపేట సెజ్లో రూ.3,038 కోట్ల పెట్టుబడి.. 2,265 మందికి జాబ్స్

మంత్రివర్గ సమావేశంలో CM చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలో నాయుడుపేట సెజ్లో పలు కంపెనీలు పెట్టుబడి పెట్టనున్నాయి. ఏపీటోమ్ కాంపోనెంట్స్ రూ.700 కోట్ల పెట్టుబడితో PCBలు, ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేయనుంది. వాల్ట్సన్ LABS రూ.1,743 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. గ్రీన్లామ్ సౌత్ లిమిటెడ్ రూ.595 కోట్లతో యూనిట్ ఏర్పాటు చేయనుంది.
News November 11, 2025
ధనియాల సాగు – అనువైన రకాలు

మనదేశంలో రబీ పంటగా అక్టోబర్-నవంబర్ నెలల్లో ధనియాలు నాటుతారు. ఈ పంట ఉత్పత్తిలో మధ్యప్రదేశ్ దేశంలోనే తొలి స్థానంలో ఉంది. APలో రాయలసీమ జిల్లాల్లో ఈ పంటను ఎక్కువగా పండిస్తున్నారు.
☛ ధనియాల సాగుకు అనువైన రకాలు – సి.ఒ.1, సి.ఒ.2, సి.ఒ.3, సి.ఒ.(సి.ఆర్)4, సి.ఎస్.287, కరన్, సి.ఐ.ఎం.ఎస్-33, సి.ఎస్.2, జి.ఎ.యు-1, యు.డి-1, యు.డి-2, యు.డి-20, యు.డి-21. వీటిలో అనువైన రకాలను వ్యవసాయ నిపుణుల సూచనలతో నాటుకోవాలి.


