News February 13, 2025
MNCL: ప్రేమ పేరుతో మోసం.. అట్రాసిటీ కేసు నమోదు

మంచిర్యాలలో ప్రేమ పేరుతో ఓ మహిళను మోసం చేసిన వ్యక్తిపై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు సీఐ ప్రమోద్ రావు తెలిపారు. పట్టణానికి చెందిన తాటికొండ రాంచందర్ ఓ మహిళను 4ఏళ్లుగా ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని బాధితురాలు బుధవారం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు రాంచందర్ పై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు.
Similar News
News December 8, 2025
అఖండ-2 రిలీజ్ ఎప్పుడు?

అఖండ-2 సినిమా కొత్త రిలీజ్ డేట్పై నిర్మాతలు ఎలాంటి ప్రకటన చేయకపోవడంపై బాలకృష్ణ అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. DEC 12న ఎట్టిపరిస్థితుల్లోనూ మూవీ విడుదల చేయాల్సిందేనని SMలో డిమాండ్ చేస్తున్నారు. #WeWantAkhanda2OnDec12th హ్యాష్ ట్యాగ్ను ట్రెండ్ చేస్తున్నారు. కొందరైతే నిర్మాతలకు వార్నింగ్ ఇస్తున్నారు. కాగా ఈ శుక్రవారమే రిలీజ్ ఉండే అవకాశం ఉందని పలువురు కామెంట్లు చేస్తున్నారు.
News December 8, 2025
బెళుగుప్ప: బైక్లు ఢీకొని ఒకరి మృతి

బెలుగుప్ప – వెంకటాద్రి పల్లి గ్రామాల మధ్య ఆదివారం రాత్రి చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. వెంకటాద్రిపల్లికి చెందిన చంద్రమౌళి బైక్ పై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన మరో బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో చంద్రమౌళి (63) మృతి చెందగా, తిప్పే స్వామి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News December 8, 2025
గ్లోబల్ సమ్మిట్కు బీజేపీ మద్దతు

TG: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న ప్రతిష్ఠాత్మక గ్లోబల్ సమ్మిట్కు మద్దతిస్తున్నట్లు BJP రాష్ట్ర అధ్యక్షుడు రామ్చందర్రావు వెల్లడించారు. ‘కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ లక్ష్యంగా అన్ని రాష్ట్రాల అభివృద్ధికి సహకరిస్తోంది. తెలంగాణకు కూడా పూర్తి అండగా ఉంటుంది. ఈ సదస్సుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరవుతారు. సమ్మిట్ విజయవంతమై రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం’ అని తెలిపారు.


