News February 8, 2025
MNCL: భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ రద్దు

సికింద్రాబాద్-కాగజ్నగర్ మధ్య రోజువారీగా రాకపోకలు సాగించే భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ (రైలు నం.17233, 17234)ను ఈ నెల 10 -20వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మంచిర్యాల జిల్లా ప్రజలు ఇబ్బందులు పడనున్నారు. ఇటీవల కాలంలో ఏ చిన్న సమస్య వచ్చినా రోజుల తరబడి రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా రద్దు చేయడం పట్ల ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News November 17, 2025
నరసరావుపేట: ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలపై అవగాహన

ఎయిర్ఫోర్స్లో ఉద్యోగాలపై స్థానిక ఎస్ఎస్ఎన్ కళాశాలలో ఈ నెల 19న అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. 16 నుంచి 20 ఏళ్ల యువత ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆర్మీలో అగ్నివీర్ తరహాలో ఎయిర్ఫోర్స్లో అగ్నివీర్ వాయుగా బాధ్యతలు నిర్వర్తించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఎక్కువ మంది యువత ఉపాధి పొందేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
News November 17, 2025
కుల్కచర్ల బాలుర పాఠశాలను తనిఖీ చేసిన డిఈఓ

కుల్కచర్ల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) రేణుకాదేవి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థుల సామర్థ్యాలను అడిగి తెలుసుకున్నారు. 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
News November 17, 2025
AP న్యూస్ రౌండప్

*నిధుల దుర్వినియోగం కేసులో IPS అధికారి సంజయ్ బెయిల్ పిటిషన్ను మూడోసారి తిరస్కరించిన ACB కోర్టు
*నకిలీ మద్యం కేసులో చొక్కా సతీశ్ రిమాండ్ను NOV 25 వరకు పొడిగింపు
*మూడు బీసీ కార్పొరేషన్లకు డైరెక్టర్లను నియమించిన ప్రభుత్వం
*తన భార్య డిజిటల్ అరెస్టుకు గురయ్యారంటూ MLA పుట్టా సుధాకర్ యాదవ్ చేసిన ఫిర్యాదుపై ఏడుగురిని అరెస్టు చేసిన కడప సైబర్ క్రైమ్ పోలీసులు


