News February 8, 2025
MNCL: భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ రద్దు

సికింద్రాబాద్-కాగజ్నగర్ మధ్య రోజువారీగా రాకపోకలు సాగించే భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ (రైలు నం.17233, 17234)ను ఈ నెల 10 -20వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మంచిర్యాల జిల్లా ప్రజలు ఇబ్బందులు పడనున్నారు. ఇటీవల కాలంలో ఏ చిన్న సమస్య వచ్చినా రోజుల తరబడి రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా రద్దు చేయడం పట్ల ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News November 12, 2025
TPT: అకడమిక్ అబ్జర్వర్ తీరుపై ఫిర్యాదుల వెల్లువ

టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేద పారాయణదారుల పోస్టుల ఇంటర్వ్యూలకు సంబంధించి పలు ఆరోపణలు వస్తున్నాయి. అకడమిక్ అబ్జర్వర్గా వ్యవహరిస్తున్న సుదర్శన శర్మ ప్రవర్తనపై కొందరు టీటీడీ బోర్డు, ఈవో, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ముఖ్యమంత్రి కార్యాలయం ప్రిన్సిపల్ సెక్రటరీ, గవర్నర్ ఏడీసీకి మెయిల్స్ పంపినట్లు సమాచారం. దీనిపై విచారణ చేసి ఆయనను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
News November 12, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

✓ బూర్గంపాడు రోడ్డు అధ్వానం.. మార్గమధ్యంలో ప్రసవం
✓ పాల్వంచ: ప్రిన్సిపల్ ప్రాక్టికల్ బోధన.. సర్వత్ర విమర్శలు
✓ చర్ల: మనస్థాపానికి గురై ట్రాన్స్జెండర్ ఆత్మహత్య
✓ పాల్వంచ పెద్దమ్మ గుడి వద్ద పోలీసుల నాకాబంది
✓ జూలూరుపాడు ఠాణాను తనిఖీ చేసిన ఎస్పీ
✓ జూబ్లీహిల్స్లో BRS జెండా ఎగరడం ఖాయం: రేగా
✓ కొత్తగూడెం: దళారులను అరికట్టేందుకే ‘కపాస్ కిసాన్’
✓ దమ్మపేట, ఆళ్లపల్లి, గుండాల మండలాల్లో రేపు పవర్ కట్
News November 12, 2025
NGKL: ‘దర్శన యాత్ర.. ఫోన్ చేయండి!’

NGKL డిపో నుంచి అన్నవరం, పంచారామ క్షేత్రాల దర్శన యాత్రకు సూపర్ లగ్జరీ బస్సును నడుపుతున్నట్లు డిపో మేనేజర్ యాదయ్య ‘Way2News’తో తెలిపారు. ఈనెల 14న రాత్రి యాత్ర ప్రారంభం కానుంది. 15న అమరేశ్వరుని దర్శనం, భీమవరం, ద్రాక్షారామం, పంచారామాలు, 16న అన్నవరం వ్రతాలు, మంగళగిరి, విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం కల్పిస్తారు. 17న తిరుగు ప్రయాణం. ఛార్జీ రూ.3,000. వివరాలకు 94904 11590, 94904 11591 సంప్రదించాలని అన్నారు.


