News March 19, 2025
MNCL: భారమంతా.. బడ్జెట్పైనే..!

రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ పై మంచిర్యాల జిల్లా ప్రజలు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఈ ఏడాది బడ్జెట్లో జిల్లాలోని మందమర్రి మండలం గాంధారి ఖిల్లా, జన్నారం మండలం కవ్వాల్ టైగర్ రిజర్వ్, జైపూర్ మండలం శివ్వారం వన్యప్రాణుల అభయారణ్యం, దండేపల్లి మండలం గూడెంగుట్ట సత్యనారాయ స్వామి దేవాలయం అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Similar News
News December 11, 2025
ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలి: ఎంపీ పుట్టా మహేష్ కుమార్

సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులందరూ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) లో ఉత్తీర్ణులు కావాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నుంచి 2010 ఆగస్టు నాటికి సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాల్సిందిగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. శీతాకాల సమావేశాల సందర్భంగా గురువారం లోక్ సభలో 377 నిబంధన కింద టీచర్ల సమస్యను ఏలూరు ఎంపీ లేవనెత్తారు. ఉపాధ్యాయుల అభ్యర్థన మేరకు పార్లమెంట్లో ప్రస్తావించారు.
News December 11, 2025
BREAKING: భువనగిరి: మరో ఊరిలో ఫలితాలు టై.. గెలుపెవరిదంటే?

యాదాద్రి-భువనగిరి జిల్లా ఆత్మకూర్ మండలం పారుపల్లి గ్రామంలో BRS, కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు ఓట్లు సమానంగా పోలయ్యాయి. BRS బలపరిచిన అభ్యర్థి పంగ కవిత నవీన్కు 80 ఓట్లు రాగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి డి.పావని రమేశ్కు సైతం 80 ఓట్లు వచ్చాయి. దీంతో అధికారులు లక్కీ డ్రా తీయగా BRS అభ్యర్థి పంగ కవిత నవీన్ గెలుపొందారు. BRS నేతలు హర్షం వ్యక్తం చేశారు.
News December 11, 2025
APPLY NOW: CSIR-SERCలో ఉద్యోగాలు

CSIR-స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ సెంటర్(<


