News January 25, 2025
MNCL: మద్యం తాగి.. వాహనాలు నడిపిన నలుగురికి జైలు: ట్రాఫిక్ CI

ఇటీవల మద్యం తాగి వాహనాలు నడిపి పట్టుబడిన 33 మందిని శుక్రవారం మంచిర్యాల సెకండ్ అడిషనల్ కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా సివిల్ జడ్జి నిరోషా 29 మందికి రూ.65,500 జరిమానా, నలుగురికి 5 రోజుల జైలు శిక్ష విధించినట్లు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తెలిపారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఆయన సూచించారు.
Similar News
News November 25, 2025
తీవ్ర అల్పపీడనం.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

AP: మలక్కా జలసంధి పరిసరాల్లో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం నేడు వాయుగుండంగా బలపడి మరో 48 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. దీని ప్రభావంతో ఈ నెల 29న రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో బారీ వర్షాలు కురుస్తాయని.. 30వ తేదీన ప్రకాశం, బాపట్ల, నెల్లూరు, కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
News November 25, 2025
MBNR: భార్య హత్య.. నిందితుడికి జీవిత ఖైదు

మహబూబ్నగర్ జిల్లా హన్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన భార్య హత్య కేసులో నిందితుడైన మిర్యాల రాములు (ఏ1)కు ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి కల్యాణ్ చక్రవర్తి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు. వివాహేతర సంబంధానికి భార్య అడ్డుపడుతుందనే కారణంతో నిందితుడు సైకిల్ హ్యాండిల్తో ఛాతీ, కడుపుపై తీవ్రంగా కొట్టి హత్య చేశాడు. ఈ కేసును విజయవంతంగా పూర్తి చేసిన పోలీసు బృందాన్ని ఎస్పీ డి.జానకి అభినందించారు.
News November 25, 2025
ఈ దిగ్గజ మహిళా క్రికెటర్ గురించి తెలుసా?

ప్రస్తుత భారత మహిళా క్రికెట్ టీమ్ సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది. అయితే దీని వెనక డయానా ఎడుల్జీ పాత్ర ఎంతో ఉంది. 50 సంవత్సరాలకుపైగా క్రికెటర్గా, అడ్మినిస్ట్రేటర్గా ఎడుల్జీ భారత క్రికెట్కు సేవలు అందించారు. ఈమెను స్ఫూర్తిగా తీసుకుని అప్పట్లో చాలామంది అమ్మాయిలు క్రికెట్కు ఆకర్షితులై ఆటలోకి అడుగుపెట్టారు. ఎడమచేతి వాటం స్పిన్నర్ అయిన డయానా భారత్ తరఫున 54 మ్యాచ్లు ఆడి 109 వికెట్లు పడగొట్టారు.


