News January 28, 2025
MNCL: మెడికల్ కార్డు పొందేందుకు మరో అవకాశం

బొగ్గు గని రిటైర్డ్ కార్మికులకు మెడికల్ కార్డు పొందడానికి మరో అవకాశం కల్పిస్తున్నట్లు జాతీయ సంఘాల నాయకులు తెలిపారు. సోమవారం రాయపూర్లో జరిగిన 6వ బోర్డు సమావేశంలో కంట్రీబ్యూటరీ పోస్ట్ రిటైర్మెంట్ మెడికల్ స్కీమ్ను మార్చి 31వరకు రూ.60వేల కంట్రిబ్యూషన్తో ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. మెడికల్ కార్డు పొందని రిటైర్డ్ సింగరేణి కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News December 4, 2025
తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం.. వెంకయ్య కీలక వ్యాఖ్యలు

AP: తాను చదువుకునే రోజుల్లో అవగాహన లేక హిందీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నానని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య చెప్పారు. మాతృభాషకు ప్రాధాన్యం ఇచ్చి, ఆ తర్వాత సోదర భాషలు నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. మచిలీపట్నం కృష్ణా వర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘AP, TGలు తెలుగును పరిపాలనా భాషగా చేసుకోవాలి. తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం ఇస్తామని చెప్పాలి. అప్పుడే తెలుగు వెలుగుతుంది’ అని పేర్కొన్నారు.
News December 4, 2025
సంగారెడ్డి: ‘మూడుసార్లు లెక్కలు చూపించాలి’

రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు మూడుసార్లు తమ లెక్కలను వ్యయ అధికారులకు చూపించాలని జిల్లా పరిశీలకులు రాకేష్ గురువారం తెలిపారు. 8, 10, 12 తేదీల్లో ఎంపీడీవో కార్యాలయంలో వ్యాయ పరిశీలన చేయించుకోవాలని చెప్పారు. వ్యాయ పరిశీల చేసుకొని అభ్యర్థులకు ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
News December 4, 2025
KNR: పంచాయతీ ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ఎన్నికల సంఘం కమిషనర్ జిల్లాలలో పంచాయతీ ఎన్నికలను నిబంధన ప్రకారం నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ.రాణి కుముదిని అన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ.రాణి కుముదిని కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. తదితర అంశాల పట్ల ఎన్నికల కమిషనర్ రివ్యూ నిర్వహించారు.


