News January 28, 2025
MNCL: మెడికల్ కార్డు పొందేందుకు మరో అవకాశం

బొగ్గు గని రిటైర్డ్ కార్మికులకు మెడికల్ కార్డు పొందడానికి మరో అవకాశం కల్పిస్తున్నట్లు జాతీయ సంఘాల నాయకులు తెలిపారు. సోమవారం రాయపూర్లో జరిగిన 6వ బోర్డు సమావేశంలో కంట్రీబ్యూటరీ పోస్ట్ రిటైర్మెంట్ మెడికల్ స్కీమ్ను మార్చి 31వరకు రూ.60వేల కంట్రిబ్యూషన్తో ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. మెడికల్ కార్డు పొందని రిటైర్డ్ సింగరేణి కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News November 26, 2025
‘కమ్లా పసంద్’ ఓనర్ కోడలు ఆత్మహత్య

పాపులర్ పాన్ మసాలా కంపెనీ ‘కమ్లా పసంద్’ ఓనర్ కమల్ కిషోర్ కోడలు దీప్తి చౌరాసియా(40) ఆత్మహత్య చేసుకున్నారు. ఢిల్లీ వసంత్ విహార్లోని తన ఫ్లాట్లో ఆమె ఉరి వేసుకొని కనిపించారు. దీప్తి గదిలో పోలీసులు సూసైడ్ లెటర్ను స్వాధీనం చేసుకున్నారు. అందులో భర్త హర్ప్రీత్ చౌరాసియా పేరును రాసినట్లు తెలుస్తోంది. 2010లో దీప్తి-హర్ప్రీత్ వివాహం చేసుకున్నారు. వారికి 14 ఏళ్ల కుమారుడు ఉన్నారు.
News November 26, 2025
BHPL: సర్పంచ్ పదవి కోసం మొదలైన సమావేశాలు

సర్పంచ్ పదవి కోసం రాజకీయ పార్టీల్లో దరఖాస్తుల కొలహాలం ప్రారంభమైంది. జయశంకర్ జిల్లాలోని 12 మండలాల్లో 248 గ్రామపంచాయతీలు ఉండగా మూడు విడతలుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వ రంగం సిద్ధం చేస్తుంది. మొదటి విడతలో నాలుగు మండలాలకు ఎన్నికలు జరగనుండగా.. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. దీంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, ఇతర పార్టీల ఆశావాహులు దరఖాస్తులు చేసుకుంటున్నారు.
News November 26, 2025
ఎన్నికలను ప్రశాంతంగా పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు ఎన్నికలను పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించాలని కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. నామినేషన్లు మూడు విడతల్లో స్వీకరించనున్నట్లు తెలిపారు. ఎన్నికల హ్యాండ్బుక్పై పూర్తి అవగాహనతో తప్పులేని విధంగా పనులు చేయాలని సూచించారు. నగదు-మద్యం పంపిణీపై ప్రత్యేక నిఘా పెట్టి చెక్పోస్టుల్లో తనిఖీలు చేయాలని ఆదేశించారు.


