News April 3, 2025
MNCL: మే1 వరకు ఇవి నిషేధం: CP

బహిరంగ ప్రదేశాల్లో మద్యంపై నిషేధాజ్ఞలను కొనసాగిస్తున్నామని CP అంబర్ కిషోర్ ఝా తెలిపారు. CP మాట్లాడుతూ.. సాధారణ పౌరులు, ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మంచిర్యాల జోన్లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడంపై నిషేధాజ్ఞలు పొడిగిస్తున్నామన్నారు. ప్రజల భద్రత కోసం ఈ నిషేధాజ్ఞలను ఏప్రిల్ 2వ తేదీ నుంచి మే1వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు.
Similar News
News December 7, 2025
ఆరోగ్యం గురించి చెప్పే మొటిమలు

ముఖంపై వచ్చే మొటిమలను బట్టి ఆరోగ్యం ఎలా ఉందో చెప్పొచ్చంటున్నారు నిపుణులు. కనుబొమ్మల మధ్య తరచూ మొటిమలు వస్తుంటే లివర్ సమస్యలు ఉన్నట్లు, నుదుటిమీద వస్తుంటే జీర్ణ సమస్యలు, ముక్కు చుట్టూ వస్తుంటే గుండె సమస్యలు, గడ్డం భాగంలో వస్తుంటే హార్మోన్ల అసమతుల్యత, చెవుల చుట్టూ వస్తుంటే కిడ్నీ రిలేటెడ్ సమస్యలు ప్రారంభమై ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మొటిమలనూ పట్టించుకోవాలని సూచిస్తున్నారు.
News December 7, 2025
ములుగు: కాంగ్రెస్లో కొనసాగుతున్న సస్పెన్షన్లు

పంచాయతీ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్లో బహిష్కరణలు కొనసాగుతున్నాయి. పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని శనివారం పీఏసీఎస్ ఛైర్మన్ చిక్కుల రాములు, మాజీ సర్పంచ్ అహ్మద్ పాషా, మాజీ ఎంపీటీసీ అశోక్ను డీసీసీ అధ్యక్షుడు అశోక్ సస్పెండ్ చేశారు. ఆదివానం ములుగు మండలం పొట్లాపూర్కు చెందిన రాజ్ కుమార్, వెంకట్ రెడ్డి, పాపయ్యలను పార్టీ నుంచి బహిష్కరించినట్లు మండల అధ్యక్షుడు చాంద్ పాషా తెలిపారు.
News December 7, 2025
గోవాకు వెళ్తున్నారా? జాగ్రత్త

2023లో HYD యువతి (30) పెళ్లికి ముందు ప్రియుడితో కలిసి గోవాకు వెళ్లింది. అక్కడ బస ఏర్పాట్లు చేసిన యశ్వంత్ అనే వ్యక్తి తాజాగా తనకు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రియుడితో గడిపిన వీడియోలను రికార్డు చేశానని, రూ.30 లక్షలు ఇవ్వకుంటే బయటపెడతానని బెదిరిస్తున్నాడని పేర్కొంది. తనకు వేరే వ్యక్తితో పెళ్లి అయిందని చెప్పినా వినట్లేదని వాపోయింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.


