News April 3, 2025

MNCL: మే1 వరకు ఇవి నిషేధం: CP

image

బహిరంగ ప్రదేశాల్లో మద్యంపై నిషేధాజ్ఞలను కొనసాగిస్తున్నామని CP అంబర్ కిషోర్ ఝా తెలిపారు. CP మాట్లాడుతూ.. సాధారణ పౌరులు, ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మంచిర్యాల జోన్‌లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడంపై నిషేధాజ్ఞలు పొడిగిస్తున్నామన్నారు. ప్రజల భద్రత కోసం ఈ నిషేధాజ్ఞలను ఏప్రిల్ 2వ తేదీ నుంచి మే1వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు.

Similar News

News December 8, 2025

సిద్దిపేట జిల్లాలో 10 నుంచి జాగ్రత్త

image

సిద్దిపేట జిల్లాలో డిసెంబర్ 10 నుంచి 13 వరకు రాబోయే 7 రోజుల్లో శక్తివంతమైన శీతల గాలలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పింక్ మార్కు ఉన్న జిల్లాల్లో ఉదయం ఉష్ణోగ్రతలు 6-9°C వరకు తగ్గనున్నాయి. అదేవిధంగా నీలం మార్క్ ఉన్న జిల్లాల్లో 9-12°C వరకు ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయి. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

News December 8, 2025

శివలింగానికి అభిషేకం చేస్తున్నారా?

image

శివుడు అభిషేక ప్రియుడు. అయనను నీటితో అభిషేకించినా అనుగ్రహిస్తాడని భక్తులు నమ్ముతారు. అయితే ఉత్తర/తూర్పు దిశలో నిలబడి రాగి/కంచు పాత్రతో శివాభిషేకం చేయడం అత్యంత శ్రేష్ఠమని పండితులు చెబుతున్నారు. అభిషేక సమయంలో ‘‘ఓం నమః శివాయ’’ అనే పంచాక్షరీ మంత్రం లేదా ‘‘ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహీ తన్నో రుద్ర ప్రచోదయాత్’’ అనే గాయత్రీ మంత్రాన్ని పఠించాలని సూచిస్తున్నారు. మరింత సమాచారం కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.

News December 8, 2025

సకీనా ఠాకూర్ సక్సెస్ వెనుక కారణాలు ఇవే

image

అమ్మాయివి.. పీజీ చేశావ్, పాల వ్యాపారం చేస్తావా? అని చాలా మంది సకీనాను ఎగతాళి చేశారు. అవేవీ పట్టించుకోకుండా తన మీద నమ్మకంతోనే ఆమె ముందడుగు వేశారు. పాడి సమాచారాన్ని Youtube, ఇతర రైతుల నుంచి తెలుసుకునేవారు. మిల్కింగ్ మెషీన్, గ్రాస్ కట్టర్ వంటి పరికరాలను ఉపయోగించి కూలీల ఖర్చు తగ్గించుకున్నారు. స్థానిక మేతతో పాటు పంజాబ్ నుంచి దాణా తెప్పించి పశువులకు అందించారు. దీంతో పాల ఉత్పత్తి, ఆదాయం పెరిగింది.