News April 4, 2024

MNCL: మైనర్ బాలికను పెళ్లి చేసుకున్న వ్యక్తి అరెస్ట్

image

మైనర్‌ బాలికను కిడ్నాప్ చేసిన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు MNCL CI బన్సీలాల్ తెలిపారు. మార్చి 28న 10th పరీక్షలు రాస్తుండగా బాలిక కనిపించడం లేదని ఆమె తల్లి సంతారు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు శ్రీకాంత్(27)అనే వ్యక్తి ఆమెను బలవంతంగా వేములవాడకు తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. అక్కడ నుంచి తిరుపతికి తీసుకెళ్తుండగా ఆమె తప్పించుకొని వచ్చినట్లు వెల్లడించారు.

Similar News

News October 31, 2025

ADB: శిశు మరణాల నివారణకు పని చేయాలి

image

ఆదిలాబాద్ వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో గురువారం జరిగిన నవజాత శిశు సంరక్షణ శిక్షణ ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిక్షణలో ప్రతిభ చూపిన వైద్యులు, సిబ్బందికి ఆయన ప్రశంసాపత్రాలు, మెమొంటోలను అందజేశారు. శిశు మరణాల నివారణకు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

News October 31, 2025

ADB: ఏకలవ్య గురుకులాల ప్రిన్సిపల్స్‌తో కలెక్టర్ సమీక్ష

image

కలెక్టరేట్‌లో గురువారం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని కలెక్టర్ రాజర్షి షా నిర్వహించారు. ఏకలవ్య పాఠశాలల అభివృద్ధి, విద్యార్థులకు అందిస్తున్న వసతులు, నాణ్యమైన విద్యపై ఆయన ప్రిన్సిపల్స్‌ను ఆరా తీశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సలోని చబ్రా, డీఎంహెచ్‌వో, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

News October 30, 2025

ఆదిలాబాద్: ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రీషెడ్యూల్

image

ఆదిలాబాద్ నుంచి గురువారం దయం 8 గంటలకు బయలుదేరాల్సిన ఆదిలాబాద్-నాందేడ్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ సమయాన్ని రైల్వే శాఖ రీషెడ్యూల్ చేసింది. ఈ రైలు ఉదయం 8 గంటలకు బదులుగా ఉదయం 11 గంటలకు ఆదిలాబాద్ నుంచి బయలుదేరుతుంది. అలాగే, ఈ రైలు సేవలను ముద్ఖేడ్-నాందేడ్-ముద్ఖేడ్ మధ్య పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.