News February 4, 2025

MNCL: రాష్ట్రస్థాయి క్రీడల్లో కమిషనరేట్‌కు 3వ స్థానం

image

కరీంనగర్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌లో రామగుండం పోలీస్ కమీషనరేట్ ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌లో మూడవ స్థానం లభించింది. ఈ సందర్భంగా పతకాలు సాధించిన పోలీస్ క్రీడాకారులు సోమవారం సీపీ ఎం. శ్రీనివాస్‌ను మర్యాదపూర్వకంగా కలవగా.. ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో పతకాలు సాధించడం పట్ల అభినందించారు. రాబోయే రోజుల్లో జాతీయస్థాయిలో రాణించి కమిషనరేట్‌కు మంచి పేరు తీసుకురావాలన్నారు.

Similar News

News October 21, 2025

ఆక్వా రైతులకు శుభవార్త చెప్పిన లోకేశ్

image

AP: ఆక్వా రైతులకు మంత్రి నారా లోకేశ్ శుభవార్త చెప్పారు. ఇప్పటివరకు తెల్లమచ్చ వైరస్ కారణంగా పొట్టు తీయని రొయ్యల ఎగుమతులపై ఆస్ట్రేలియా పరిమితులు విధించగా తాజాగా వాటిని ఎత్తివేసి ఎగుమతులకు అనుమతించిందని మంత్రి చెప్పారు. దీనికోసం కృషిచేసిన ఇండియా, ఆస్ట్రేలియా ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు కొత్త మార్కెట్లకు విస్తరించాల్సిన అవసరముందని ఇది నిరూపిస్తోందని వివరించారు.

News October 21, 2025

పోలీస్ అమరుల ఆశయాలను నెరవేర్చాలి: KMR SP

image

పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమైనవని కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో అమరవీరుల స్తూపం వద్ద SP నివాళులర్పించి, శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమరుల ఆశయాలను నెరవేర్చడం, వారి కుటుంబాల సంక్షేమం కోసం కృషి చేయడమే మనం వారికి అందించే నిజమైన నివాళి అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరసింహ రెడ్డి, చైతన్య రెడ్డి పాల్గొన్నారు.

News October 21, 2025

మద్నూర్: రావి ఆకుపై పోలీసుల అమర వీరుల స్థూపం

image

మద్నూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో చిత్రకళ ఉపాధ్యాయునిగా పని చేస్తున్న బాస బాల్ కిషన్ పోలీసుల అమర వీరుల దినోత్సవం సందర్భంగా రావి ఆకుపై అమర వీరుల స్థూపం చిత్రం వేశారు. శాంతి భద్రతలు కాపాడే ప్రయత్నంలో అమరులైన పోలీసులను మరువరాదని చిత్రం ద్వారా చూపిస్తూ నివాళి అర్పించారు. ఈ చిత్రం చూసిన పలువురు బాల్ కిషన్‌ను అభినందించారు.