News February 4, 2025
MNCL: రాష్ట్రస్థాయి క్రీడల్లో కమిషనరేట్కు 3వ స్థానం

కరీంనగర్లో జరిగిన రాష్ట్రస్థాయి పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో రామగుండం పోలీస్ కమీషనరేట్ ఓవరాల్ ఛాంపియన్షిప్లో మూడవ స్థానం లభించింది. ఈ సందర్భంగా పతకాలు సాధించిన పోలీస్ క్రీడాకారులు సోమవారం సీపీ ఎం. శ్రీనివాస్ను మర్యాదపూర్వకంగా కలవగా.. ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో పతకాలు సాధించడం పట్ల అభినందించారు. రాబోయే రోజుల్లో జాతీయస్థాయిలో రాణించి కమిషనరేట్కు మంచి పేరు తీసుకురావాలన్నారు.
Similar News
News July 11, 2025
జనాభా లెక్కల్లోనూ రంగారెడ్డి జిల్లా తగ్గేదేలే!

రంగారెడ్డి జిల్లాలో జనాభా శరవేగంగా పెరుగుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 24,46,265 మంది ఉండగా.. వీరిలో 12,54,184 మంది పురుషులు,11,92,081 మంది మహిళలు ఉన్నారు. 2023 నవంబర్లో ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ఓటర్ల జాబితా ప్రకారం 18 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 35,23,219కు చేరింది. జిల్లా పరిశ్రమలతో పాటు రియల్ ఎస్టేట్ రంగాల్లో అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో 13 ఏళ్లలో జనాభా 48 లక్షలకు చేరిందని అంచనా.
News July 11, 2025
MBNR: పల్లె పోరు.. రిజర్వేషన్ల ఫీవర్

ఆగస్టు నెలాఖరు కల్లా పరిషత్, సర్పంచ్ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఇప్పటికే పల్లెల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఆయా నేతల్లో రిజర్వేషన్ల భయం పట్టుకుంది. ఏ రిజర్వేషన్ వస్తదో అని చర్చించుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాల్లో 1,684 గ్రామపంచాయతీలు ఉండగా.. 23,22,054 మంది పల్లెల్లో ఓటర్లు ఉన్నారు. 74 ZPTC స్థానాలతో పాటు 19 పురపాలికలున్నాయి.
News July 11, 2025
రాజంపేట: యువకుల మిస్సింగ్పై పవన్కు ఫిర్యాదు

రాజంపేటకు చెందిన ముగ్గురు యువకులు థాయిలాండ్లో ఉద్యోగానికి వెళ్లి అదృశ్యమయ్యారు. వాళ్ల అచూకీ కనిపెట్టాలని రాజంపేటకు చెందిన పూజారి గిరిజా కుమారి అనే మహిళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కోరారు. ఆయనకు యువకుల వివరాలు అందజేశారు. మహిళ ఫిర్యాదుతో డిప్యూటీ సీఎం కేంద్రంతో మాట్లాడారు. రాజంపేటలోని ఎస్వీ నగర్కు చెందిన ఓ యువకుడితో మరో ఇద్దరు 3నెలల కిందట థాయిలాండ్ వెళ్లగా వాళ్ల ఆచూకీ లభించలేదు.