News January 23, 2025

MNCL: రాష్ట్ర ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌కు సన్మానం

image

తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ ఛైర్మన్ శ్రీనివాస్‌రెడ్డిని బుధవారం సాయంత్రం మంచిర్యాల కేంద్రంలో జన్నారం మండల టీయూడబ్ల్యూజే(ఐజేయూ) ప్రతినిధులు సత్కరించారు. సత్కరించిన వారిలో మండల జర్నలిస్టులు నరసయ్య, మల్లేశం, లింగన్న, కిరణ్, వెంకటయ్య, సతీష్, రాజేందర్, శంకర్ తదితరులు ఉన్నారు.

Similar News

News November 22, 2025

BOIలో 115 SO పోస్టులు

image

బ్యాంక్ ఆఫ్ ఇండియా(BOI)లో 115 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఉద్యోగాన్ని బట్టి B.Tech, BE, MSc, MCA అర్హత గల అభ్యర్థులు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. నెలకు జీతం రూ.64,820 నుంచి రూ.1,20,940 వరకు చెల్లిస్తారు. ఆన్‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.850, SC, ST, PWBDలకు రూ.175. వెబ్‌సైట్: https://bankofindia.bank.in/

News November 22, 2025

కర్నూలు: సీఐ జీపు ఎత్తుకెళ్లిన మందుబాబు!

image

కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో వింత ఘటన జరిగింది. పెద్దహోతూరుకు చెందిన యువరాజు మద్యం మత్తులో సీఐ రవిశంకర్ జీపును ఎత్తుకెళ్లాడు. పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించగా యువరాజు డ్రంకన్ డ్రైవ్‌లో బైక్‌తో పట్టుబడ్డారు. తన బైక్ ఇవ్వనందుకు పోలీసులను మరిపించి సీఐ జీపును తన గ్రామానికి తీసుకెళ్లాడు. ఇది గమనించిన యువరాజు సోదరుడు అంజి వెంటనే జీపును తిరిగి పోలీస్ స్టేషన్‌కు చేర్చారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

News November 22, 2025

MBNR: ఏకగ్రీవ పంచాయతీలకు రూ.10 లక్షలు..!

image

వచ్చే నెలలో నిర్వహించనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులను ఏకగ్రీవం చేసే గ్రామాలకు రూ.10 లక్షల ప్రొత్సాహకం అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. మొదట తెలంగాణ ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నద్ధమైంది. మహబూబ్‌నగర్ 441, నాగర్‌కర్నూల్ 461, నారాయణపేట 280, వనపర్తి 268, గద్వాల్ 255 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.