News October 25, 2024
MNCL: రేపటి నుంచి ఉచిత చేప పిల్లల పంపిణీ

మత్స్యకారులకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నుంచి మంచిర్యాల జిల్లాలో ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది జిల్లాలోని జలాశయాలు, చెరువులు, కుంటలలో 2.18 కోట్ల చేప పిల్లలను విడుదల చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో ఎల్లంపల్లి ప్రాజెక్టు, సుందిళ్ల బ్యారేజీలో రొయ్య పిల్లలు పంపిణీ చేస్తారు.
Similar News
News November 15, 2025
నిర్దిష్ట గడువులో పనులు పూర్తి చేయాలి: ADB కలెక్టర్

పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ వంటి మౌలిక వసతుల పనులను వేగవంతం చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా సంబంధిత అధికారులను ఆదేశించారు. పాఠశాలల మౌలిక సదుపాయాలపై కలెక్టర్ విద్యాశాఖ అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. పాఠశాలల మౌలిక సదుపాయాల పనుల్లో ఏ మాత్రం ఆలస్యం సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రతి పనికి స్పష్టమైన టైమ్లైన్ ఖరారు చేసి నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు.
News November 15, 2025
దర్యాప్తు, పరిశోధన నాణ్యత ప్రమాణాలతో నిర్వహించాలి: ADB ఎస్పీ

హత్య, ఆత్మహత్య, రోడ్డు ప్రమాదాలు, అనుమానాస్పద మరణం, నీటిలో మునిగి చనిపోయిన, ఇతర నేరాల దర్యాప్తుకు సంబంధించి పోలీస్ సిబ్బందికి 5 రోజుల పాటు శిక్షణ అందించారు. ఈ శిక్షణలో 21 మంది పాల్గొన్నారు. కోర్టులో నేరస్థులకు శిక్షలు పడినప్పుడు ప్రజల్లో పోలీసుల పట్ల నమ్మకం పెరుగుతుందని ఎస్పీ పేర్కొన్నారు. నేర స్థలాన్ని ఏర్పాటు చేసి శిక్షణను అందించారు. ఎఫ్ఐఆర్, కస్టడీ, అరెస్టు, రిమాండ్ అంశాలపై శిక్షణ అందించారు.
News November 15, 2025
ఆధార్ సేవల్లో వేగం, ఖచ్చితత్వం పెంచాలి: కలెక్టర్

ఆదిలాబాద్ జిల్లాలో ఆధార్ సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. ఇటీవల నిర్వహించిన ఆధార్–మీసేవ ప్రత్యేక సమీకృత శిబిరాల్లో దరఖాస్తు చేసిన విద్యార్థులకు మంజూరైన ఆధార్ కార్డులు, ఆదాయ, నివాసతో పాటు పలు ధ్రువీకరణ పత్రాలను కలెక్టర్ పంపిణీ చేశారు. దరఖాస్తులు పెండింగ్లో ఉండకూడదని అన్నారు.


