News February 13, 2025
MNCL: రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

మంచిర్యాల- పెద్దంపేట రైల్వే స్టేషన్ల మధ్య బుధవారం గుర్తుతెలియని రైలు కింద పడి అటకపురం రాజలింగు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. చెన్నూరు మండలంలోని అక్కెపల్లి గ్రామానికి చెందిన మృతుడు కుమ్మరి వృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కుటుంబ కలహాలతో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడినట్లు జీఆర్పీ ఎస్సై మహేందర్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ సంపత్ వెల్లడించారు.
Similar News
News November 13, 2025
MP మిథున్ రెడ్డికి జనసేన కౌంటర్

మిథున్ రెడ్డి సోషల్ మీడియాలో బుకాయిస్తే ఆయన తండ్రి <<18276752>>ఆక్రమణలు <<>>సక్రమం కావని జనసేన విమర్శించింది. ‘1968 SEP 16న మంగళంపేట ఫారెస్ట్ గెజిట్ ప్రకారం 76ఎకరాలున్న మీ భూమి 103.98 ఎకరాలు ఎలా అయ్యిందో చెబుతారా మిథున్ రెడ్డి. అడవిని ఎలా కబ్జా చేశారో మీ తండ్రిని అడగండి. 32.63ఎకరాల అడవిని కబ్జా చేసేసినంత ఈజీ కాదు చట్టం నుంచి తప్పించుకోవడం. కాసేపట్లో మీ కబ్జా చిట్టా బయటికి వస్తుంది’ అని ట్వీట్ చేసింది
News November 13, 2025
NTR: మాజీ మంత్రి జోగి రమేశ్ రిమాండ్ పొడిగింపు

ఇబ్రహీంపట్నంలో చర్చనీయాంశమైన నకిలీ మద్యం కేసులో నిందితులకు విజయవాడ ఎక్సైజ్ కోర్టు రిమాండ్ పొడిగించింది. ఈ నెల 25 వరకు రిమాండ్లో ఉంచేందుకు అనుమతించింది. నెల్లూరు జైలులో జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న జోగి రమేశ్, రామును పోలీసులు జడ్జి ఎదుట హాజరుపరిచారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం నేడు రిమాండ్ పొడిగించింది.
News November 13, 2025
మిథున్ రెడ్డికి జనసేన కౌంటర్

మిథున్ రెడ్డి సోషల్ మీడియాలో బుకాయిస్తే ఆయన తండ్రి <<18276752>>ఆక్రమణలు <<>>సక్రమం కావని జనసేన పేర్కొంది. ‘1968 సెప్టెంబర్ 16న మంగళంపేట ఫారెస్ట్ గెజిట్ ప్రకారం 76ఎకరాలున్న భూమి 103ఎకరాల 98సెంట్లు ఎలా అయ్యిందో చెబుతారా మిథున్ రెడ్డి. అడవిని ఎలా కబ్జా చేశారో మీ తండ్రిని అడగండి. 32ఎకరాల 63సెంట్లు అడవిని కబ్జా చేసేసినంత ఈజీ కాదు చట్టం నుంచి తప్పించుకోవడం. కాసేపట్లో మీ కబ్జా చిట్టా బయటికి వస్తుంది’ అని ట్వీట్ చేసింది


