News March 1, 2025
MNCL: రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హమాలివాడ సమీపంలో రైలు కింద పడి శుక్రవారం ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని మందమర్రి పట్టణంలోని రామన్ కాలనీకి చెందిన నస్పూరి వినయ్గా గుర్తించారు. మృతుడు ప్రైవేట్ డ్రైవర్గా జీవనం సాగిస్తుండగా.. భార్యా భర్తల మధ్య గొడవల కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. ఈ మేరకు జీఆర్పీ ఎస్ఐ ఆధ్వర్యంలో హెడ్ కానిస్టేబుల్ జస్పాల్ సింగ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News October 17, 2025
NGKL: శాంతి భద్రతల పరిరక్షణకు అందరూ సహకరించాలి: ఐజీ చౌహాన్

శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జోగులాంబ జోన్ ఐజీ ఎల్ హెచ్ చౌహాన్ అన్నారు. శుక్రవారం అచ్చంపేట డీఎస్పీ, సీఐ కార్యాలయాలను ఆయన తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. స్టేషన్కు వచ్చే బాధితులకు అండగా ఉండి న్యాయం చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, సీఐ నాగరాజు, శంకర్ నాయక్, సబ్ డివిజన్ పరిధిలోని ఎస్ఐలు పాల్గొన్నారు.
News October 17, 2025
‘రేపల్లె నుంచి బాపట్లకు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలి’

రేపల్లె నుంచి బాపట్లకు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని భారత రైల్వే బోర్డు ఛైర్మన్ సతీశ్ కుమార్ను బాపట్ల ఎంపీ కృష్ణ ప్రసాద్ కోరారు. గురువారం దిల్లీలో ఆయనను కలిసి రైల్వే పరిధిలో బాపట్లలో ఎదుర్కొంటున్న పలు సమస్యలను విన్నవించారు. బాపట్ల, చీరాల రైల్వే స్టేషన్లలో వందే భారత్ రైలుకు స్టాప్ కల్పించాలని రెండు రైల్వే స్టేషన్లో అధునాతన పద్ధతిలో నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.
News October 17, 2025
ఇతిహాసాలు క్విజ్ – 38 సమాధానాలు

1. సీతాదేవి స్వయంవరంలో శ్రీరాముడు విరిచిన శివధనస్సు పేరు ‘పినాక’.
2. మహాభారత యుద్ధంలో శకునిని చంపింది ‘సహదేవుడు’.
3. మహాశివరాత్రి ‘మాఘ’ మాసంలో వస్తుంది.
4. త్రింశత్ అంటే ‘ముప్పై’.
5. శివాలయాలలో గర్భగుడి నుంచి అభిషేక జలం బయటకు వెళ్లే ద్వారాన్ని ‘సోమసూత్రం’ అని అంటారు.
<<-se>>#Ithihasaluquiz<<>>