News March 1, 2025
MNCL: రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హమాలివాడ సమీపంలో రైలు కింద పడి శుక్రవారం ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని మందమర్రి పట్టణంలోని రామన్ కాలనీకి చెందిన నస్పూరి వినయ్గా గుర్తించారు. మృతుడు ప్రైవేట్ డ్రైవర్గా జీవనం సాగిస్తుండగా.. భార్యా భర్తల మధ్య గొడవల కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. ఈ మేరకు జీఆర్పీ ఎస్ఐ ఆధ్వర్యంలో హెడ్ కానిస్టేబుల్ జస్పాల్ సింగ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News November 7, 2025
ఏటూరునాగారం ఫారెస్ట్లో సీతాకోక చిలుకల సర్వే

ఏటూరునాగారం వైల్డ్ లైఫ్ అభయారణ్యం పరిసరాలలో సీతాకోకచిలుకలు, చిమ్మెటలపై సర్వే గురువారం ప్రారంభమైంది. అడవుల విస్తరణ, పునరుత్పత్తికి దోహదపడే వీటి సంతతి, మనుగడపై ఈ సర్వే ఈనెల 9 వరకు జరగనుంది. ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ, వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ సంస్థల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సర్వేను డీఎఫ్వో రాహుల్ కిషన్ జాదవ్ ప్రారంభించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 33 మంది నిపుణులు పాల్గొంటున్నారు.
News November 7, 2025
Paytm నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్

పేటీఎం సంస్థ ‘చెక్-ఇన్’ పేరిట కొత్త AI ట్రావెల్ బుకింగ్ యాప్ను ప్రారంభించింది. బస్, మెట్రో, ట్రైన్స్, ఫ్లైట్స్కు సంబంధించిన వంటి టికెట్స్ను ఈ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ మేనేజ్మెంట్, పర్సనల్ ట్రావెల్ ప్లాన్స్, డెస్టినేషన్ రికమెండేషన్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. దీంతో ప్రజలు మరింత స్మార్ట్గా, సులభంగా ట్రావెలింగ్ ప్లాన్ చేసుకోవచ్చని పేటీఎం ట్రావెల్ సీఈవో వికాస్ జలాన్ తెలిపారు.
News November 7, 2025
వనపర్తిలో నవంబర్ 10న అప్రెంటీషిప్ మేళా

వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో నవంబర్ 10న అప్రెంటిషిప్ మేళా ఉంటుందని కళాశాల ప్రిన్సిపల్ కే.రమేష్ బాబు తెలిపారు. ఐటీఐ పాస్ అయిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అభ్యర్ధులు అప్రెంటిస్ షిప్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ మేళాకు ధ్రువీకరణ పత్రాలతో రావాలన్నారు. వివరాలకు ట్రైనింగ్ ఆఫీసర్ ఎంఈ హక్ను లేదా సెల్ నంబర్లను 9849244030, 9490202037 సంప్రదించాలన్నారు.


