News March 1, 2025

MNCL: రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

image

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హమాలివాడ సమీపంలో రైలు కింద పడి శుక్రవారం ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని మందమర్రి పట్టణంలోని రామన్ కాలనీకి చెందిన నస్పూరి వినయ్‌గా గుర్తించారు. మృతుడు ప్రైవేట్ డ్రైవర్‌గా జీవనం సాగిస్తుండగా.. భార్యా భర్తల మధ్య గొడవల కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. ఈ మేరకు జీఆర్పీ ఎస్ఐ ఆధ్వర్యంలో హెడ్ కానిస్టేబుల్ జస్పాల్ సింగ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News March 20, 2025

హనుమకొండ: కాళేశ్వరానికి భారీ నిధులు

image

రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌‌లో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని కాళేశ్వరం, దేవాదుల సహా పలు ప్రధాన ప్రాజెక్టుల అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించింది. ఉమ్మడి వరంగల్ రూ. 4028.59కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించగా ఇందులో సింహభాగం కాళేశ్వరానికి రూ.2,685కోట్లు ఇచ్చింది. దీంతో పెడింగ్‌లోని ప్రాజెక్టులు పనులు పూర్తికానున్నాయి.

News March 20, 2025

నెల్లూరు: 10 మంది టీచర్లు సస్పెండ్

image

Open 10th Examsలో మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన ఘటనలో 10 మంది టీచర్లపై చర్యలు తీసుకున్నట్లు RJD లింగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. కందుకూరు మండలంలోని TRR ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, శ్రీచైతన్య హైస్కూల్‌ పరీక్ష కేంద్రాల్లో Open 10th Exams జరుగుతుండగా RJD తనిఖీ చేశారు. మాస్‌ కాపీయింగ్‌ను ఎంకరేజ్ చేసిన 10మంది టీచర్లను సస్పెండ్ చేయగా, నలుగురు విద్యార్థులను డిబార్ చేశామన్నారు.

News March 20, 2025

ఎన్టీఆర్: సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ రద్దు 

image

నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్న కారణంగా విజయవాడ మీదుగా గుంటూరు-విశాఖపట్నం మధ్య ప్రయాణించే సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లను దక్షిణ మధ్య రైల్వే రెండు రోజుల పాటు రద్దు చేసింది. ఈ మేరకు మార్చి 23,24 తేదీలలో గుంటూరు- విశాఖపట్నం(నం.17239), విశాఖపట్నం-గుంటూరు(నం.17240) సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ను మార్చి 24,25 తేదీలలో రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. 

error: Content is protected !!