News March 8, 2025

MNCL: రోడ్డు ప్రమాదంలో మహిళ కూలీ దుర్మరణం

image

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ కు చెందిన చిట్యాల నర్సమ్మ అనే మహిళ శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. కూలీ పని చేసే నర్సమ్మ ఉదయం ఇంటి నుంచి బయలుదేరి హైవే మీదుగా వెళుతుండగా అమరవాది ప్లైఓవర్ బ్రిడ్జి డివైడర్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొంది. దీంతో తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడిక్కడే మరణించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు.

Similar News

News February 25, 2026

జగిత్యాల: 253 మంది విద్యార్థుల గైర్హాజరు

image

జగిత్యాల జిల్లాలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు 30 కేంద్రాల్లో ప్రశాంతంగా జరిగాయి. జనరల్ కోర్సుల్లో 6,879 మంది, ఒకేషనల్‌లో 1,029 మంది హాజరుకాగా 253 మంది గైర్హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ ఎస్‌కేఎన్‌ఆర్ జూనియర్ కళాశాలను పరిశీలించారు. అదనపు కలెక్టర్ బి.ఎస్.లత పలు కేంద్రాలు సందర్శించారు. ఒక విద్యార్థి ఆలస్యంగా రావడంతో అనుమతించలేదు. మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదు.

News February 25, 2026

విధులకు డుమ్మా… 94 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంటు ప్రొఫెసర్ల తొలగింపు

image

TG: ఓ పక్క ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో జీతాలు…మరోపక్క విధులకు డుమ్మాకొడుతూ ప్రైవేటు ప్రాక్టీసు. బోధనాసుపత్రుల్లోని ప్రొఫెసర్లు, Asst ప్రొఫెసర్ల బాగోతమిది. ఒకరో ఇద్దరో కాదు రాష్ట్రవ్యాప్తంగా 94మంది కొన్నేళ్లుగా విధులకు రావడం లేదు. వీరికి నోటీసులు జారీచేసిన ప్రభుత్వం తాజాగా అందరినీ ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. గైర్హాజరీ తేదీ నుంచే ఈ టెర్మినేషన్ అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.

News February 25, 2026

WNP: క్రీడా పాఠశాలలో నాలుగో తరగతి ప్రవేశాలు

image

క్రీడా పాఠశాలల్లో నాలుగో తరగతి ప్రవేశాల కోసం ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు వనపర్తి జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి సుధీర్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 31న వనపర్తిలోని బాలకృష్ణయ్య క్రీడా మైదానంలో జరిగే జిల్లా స్థాయి పోటీలకు హాజరుకావాలన్నారు. మండల స్థాయి ఎంపికలకు వెళ్లే బాల బాలికలు మొదటగా tgss.telangana.gov.in వెబ్‌సైట్‌లో
రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని పేర్కొన్నారు.