News March 8, 2025
MNCL: రోడ్డు ప్రమాదంలో మహిళ కూలీ దుర్మరణం

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ కు చెందిన చిట్యాల నర్సమ్మ అనే మహిళ శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. కూలీ పని చేసే నర్సమ్మ ఉదయం ఇంటి నుంచి బయలుదేరి హైవే మీదుగా వెళుతుండగా అమరవాది ప్లైఓవర్ బ్రిడ్జి డివైడర్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొంది. దీంతో తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడిక్కడే మరణించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు.
Similar News
News December 3, 2025
మరోసారి వార్తల్లో కర్ణాటక సీఎం.. వాచ్ ప్రత్యేకతలివే

కర్ణాటకలో కుర్చీ వివాదం సద్దుమణగక ముందే CM సిద్దరామయ్య మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన ధరించిన వాచ్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. శాంటోస్ డి కార్టియర్ మోడల్ లగ్జరీ వాచ్ ధర రూ.43 లక్షల 20 వేలు. 18K రోజ్ గోల్డ్తో తయారైంది. సిల్వర్ వైట్ డయల్లో గంటలు, నిమిషాలు, సెకన్ల పిన్స్ సెల్ఫ్ వైండింగ్ మెకానికల్ మూవ్మెంట్తో పని చేస్తాయి. 6వ నంబర్ ప్లేస్లో డేట్ ఫీచర్, 39.88mm వెడల్పు, 9mm మందం ఉంది.
News December 3, 2025
వరంగల్ మార్కెట్లో పెరిగిన మొక్కజొన్న ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం పల్లికాయ, మొక్కజొన్న ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా పచ్చి పల్లికాయ రూ.5,400 ధర పలికినట్లు వ్యాపారులు తెలిపారు. మొక్కజొన్నకు రూ.1,945 ధర వచ్చిందన్నారు. కాగా, గత రెండు రోజులతో పోలిస్తే నేడు మొక్కజొన్న ధర పెరిగింది. మక్కలు బిల్టీకి సోమవారం రూ.1,935 ధర రాగా, మంగళవారం రూ.1,905 ధర వచ్చింది.
News December 3, 2025
శ్రీకాకుళం: ‘స్ర్కబ్ టైఫస్ వ్యాధి..పరిశుభ్రతతో దూరం

‘స్ర్కబ్ టైఫస్’ వ్యాధి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శ్రీకాకుళం(D) కొత్తూరు, గార, హిరమండలంలో 10 రోజుల క్రితం కొంతమంది దీని బారిన పడ్డారు. ఎన్ని కేసులు నమోదయ్యాయో అధికార ప్రకటన రావాల్సి ఉంది. అపరిశుభ్ర ప్రాంతాల్లో నల్లిని పోలిన చిన్న పురుగు పెరుగుతోంది. ఇది కుట్టడంతో ఈ వ్యాధి వ్యాపిస్తోందని, తీవ్ర జ్వరం, అలసట, జలుబు ఉంటే తక్షణం చికిత్స తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. పరిశుభ్రత పాటించాలన్నారు.


