News March 1, 2025
MNCL: వచ్చే విద్యా సంవత్సరానికి సిద్ధంగా ఉండాలి: కలెక్టర్

2025-26 విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం మంచిర్యాల కలెక్టరేట్ లో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఏకరూప దుస్తుల తయారీ ప్రక్రియ సకాలంలో పూర్తి చేయాలని తెలిపారు. మండల ప్రత్యేక అధికారులు తమ పరిధిలోని సంక్షేమ వసతి గృహాలలో తప్పనిసరిగా నిద్ర చేయాలన్నారు.
Similar News
News December 6, 2025
సమాచార హక్కు చట్టం.. సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం: కలెక్టర్

ఏలూరు కలెక్టర్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం 20 సంవత్సరాల వేడుకలు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం నిర్వహించారు. సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చి 20 సంవత్సరాలు పూర్తి అయిందని, సమాచార హక్కు చట్టం సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం అన్నారు. అధికారులు నిర్ణీత సమయంలో సమాచారం ఇవ్వాలని నిర్లక్ష్యం, అలసత్వం వహిస్తే పరిస్థితి సీరియస్ అవుతుందని పేర్కొన్నారు.
News December 6, 2025
NTR: SSC నామినల్ రోల్స్ ఎడిట్ ఆప్షన్

యూడైస్ ప్లస్ పోర్టల్లో SSC నామినల్ రోల్ విద్యార్థుల పరీక్ష వివరాల సవరణ కోసం ఎడిట్ ఆప్షన్ డిసెంబర్ 6న అందుబాటులోకి వచ్చిందని ఉప విద్యాశాఖ అధికారి శ్యాంసుందర్రావు తెలిపారు. సబ్జెక్టులు, సీడబ్ల్యూఎస్ఎన్ స్థితి, ఫోటోలు, సంతకం వంటి లోపాలను సరిచేయాలని ఆయన సూచించారు. యూడైస్ ప్లస్లో చేసిన మార్పులు 24 గంటల్లో బీఎస్ఈ పోర్టల్లో ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయని స్పష్టం చేశారు.
News December 6, 2025
దంపతులకు దత్తత ఫైనల్ ఆర్డర్ అందజేసిన కలెక్టర్

ఏలూరు కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఫ్రీ అడాప్షన్ పోర్టల్ ద్వారా 8నెలల చరణ్ బాబుకు తుది దత్తత ఆర్డర్ను జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అందజేశారు. మహబూబ్నగర్కు చెందిన దంపతులకు ఈబిడ్డను దత్తత ఇచ్చారు. బాబును చూసుకునే విధానం, పోషణ, ఇమ్యునైజేషన్ వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత, దత్తత తీసుకున్న వారిని సొంత తల్లిదండ్రులుగా గుర్తించి ఫైనల్ ఆర్డర్ ఇచ్చినట్లు కలెక్టర్ తెలిపారు.


