News January 29, 2025

MNCL: ‘విద్యార్థుల భవిష్యత్తుపై మాదకద్రవ్యాలప్రభావాన్ని నియంత్రించాలి’

image

విద్యార్థుల భవిష్యత్తుపై మాదకద్రవ్యాల ప్రభావాన్ని నియంత్రించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం మంచిర్యాల కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల ఉత్పత్తి, రవాణా, విక్రయం, వినియోగాలను నిరోధించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థులకు అవగాహన కల్పించాలని తెలిపారు.

Similar News

News December 6, 2025

అవినీతి నిర్మూలనకు మాతో కలిసి నడవండి: ఎస్పీ

image

అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) వారోత్సవాల సందర్భంగా ఎస్పీ పరితోష్ పంకజ్ శనివారం వారోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవినీతిని నిర్మూలించడానికి ప్రజలు పోలీసులతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగినా, డిమాండ్ చేసినా వెంటనే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎస్పీ చెప్పారు.
-SHARE IT

News December 6, 2025

చరిత్ర సృష్టించిన డికాక్

image

మూడో వన్డేలో భారత్‌పై సెంచరీ చేసిన(83 బంతుల్లో 106) డికాక్ అరుదైన రికార్డు సృష్టించారు. ఒకే టీమ్‌పై అత్యధిక సెంచరీలు(7) చేసిన వికెట్ కీపర్‌గా నిలిచారు. ఆ తర్వాత గిల్‌క్రిస్ట్(6)vsSL, సంగక్కర(6)vsIND ఉన్నారు. అలాగే వన్డేల్లో అత్యధిక శతకాలు(23) బాదిన వికెట్ కీపర్‌గా సంగక్కర సరసన చేరారు. అలాగే భారత్‌పై హయ్యెస్ట్ సెంచరీలు(7) చేసిన ప్లేయర్‌గా జయసూర్యతో సమానంగా నిలిచారు.

News December 6, 2025

మూడో విడతలో 27,277 నామినేషన్లు

image

TG: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మూడో విడతలో 4,158 సర్పంచ్ స్థానాలకు 27,277 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. 36,442 వార్డు స్థానాలకు 89,603 మంది నామినేషన్లు వేశారని పేర్కొన్నారు. అత్యధికంగా సిద్దిపేట జిల్లాలో 1,192 సర్పంచ్ నామినేషన్లు దాఖలయ్యాయని చెప్పారు. ఉపసంహరణకు గడువు ఈ నెల 9 వరకు ఉంది. మూడో విడత ఎన్నికలు 17న జరగనున్నాయి.