News January 29, 2025

MNCL: ‘విద్యార్థుల భవిష్యత్తుపై మాదకద్రవ్యాలప్రభావాన్ని నియంత్రించాలి’

image

విద్యార్థుల భవిష్యత్తుపై మాదకద్రవ్యాల ప్రభావాన్ని నియంత్రించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం మంచిర్యాల కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల ఉత్పత్తి, రవాణా, విక్రయం, వినియోగాలను నిరోధించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థులకు అవగాహన కల్పించాలని తెలిపారు.

Similar News

News November 26, 2025

KMR: గెలుపు గుర్రాలకై వేట.. ఎన్నికలపై ఉత్కంఠ

image

కామారెడ్డి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వేడెక్కింది. కోడ్ విడుదల కావడంతో ఎన్నికలు త్వరలోనే జరుగుతాయనే ప్రచారం ఊపందుకుంది. దీంతో ఆయా పార్టీల నాయకులు తమ అనుచరులతో, సమావేశాలు నిర్వహిస్తూ, గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నారు. టికెట్ ఆశిస్తున్న నాయకులు పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. పార్టీ అధిష్ఠానాలు కూడా విజయావకాశాలు మెరుగ్గా ఉన్న అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి.

News November 26, 2025

2033 నాటికి 150 లక్షల టన్నుల పాల ఉత్పత్తి లక్ష్యం

image

AP: పాల ఉత్పత్తిలో ప్రస్తుతం దేశంలో ఏడో స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని 2033 నాటికి తొలి 3 స్థానాల్లో నిలిపేందుకు కృషి చేస్తున్నామని పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ దామోదరనాయుడు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏటా 139.46 లక్షల టన్నుల పాల ఉత్పత్తి జరుగుతోందని.. 2033 నాటికి దీన్ని 150 లక్షల టన్నులకు పెంచడమే లక్ష్యమన్నారు. రాష్ట్రంలో 25 లక్షల మంది రైతులు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు.

News November 26, 2025

దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి రాజ్యాంగమే మార్గదర్శి: రాష్ట్రపతి

image

భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ భవనంలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో ఆమె మాట్లాడారు. ‘దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి రాజ్యాంగమే మార్గదర్శి. 25Cr మందిని పేదరికం నుంచి బయటకు తీసుకురావడం అతిపెద్ద ఘనత. ఆర్థిక ఏకీకరణలో భాగంగా GST తీసుకొచ్చాం. మహిళా సాధికారిత కోసం ట్రిపుల్ తలాక్ తీసేశాం. Art370ని రద్దు చేశాం’ అని చెప్పారు.