News February 24, 2025

MNCL: వేలాల జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

image

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వేలాల జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపిస్తున్నట్లు మంచిర్యాల డిపో మేనేజర్ జనార్దన్ తెలిపారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడుస్తాయని పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం లబ్ధిదారులకు నిర్దేశిత బస్సుల్లో ఉచిత ప్రయాణం అనుమతించనున్నట్లు వెల్లడించారు. వివరాల కోసం 9959226004, 832-802-1517 నంబర్లను సంప్రదించాలన్నారు.

Similar News

News December 18, 2025

పరిగి: తీవ్ర ఉద్రిక్తతల మధ్య మాదారంలో బోయిని రాములు విజయం

image

తీవ్ర ఉద్రిక్తతల మధ్య జరిగిన వికారాబాద్ జిల్లా పరిగి మండలం<<18588851>> మాదారం సర్పంచ్<<>> ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి బోయిని రాములు విజయం సాధించారు. బుధవారం ఉదయం జరిగిన దాడిలో రాములుకు తీవ్ర గాయాలు కావడంతో ఆయనను పరిగి ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆయన గ్రామంలో లేక పోవడంతో పార్టీ నాయకులు ధ్రువీకరణ పత్రం అందుకున్నారు.

News December 18, 2025

వరంగల్: ఆ ఇద్దరు మళ్లొచ్చారోచ్!

image

ఒకాయన చేసిన తుపాకీ సెటిల్మెంట్‌కి ఆమె మంత్రి పదవికే ఎసరు తెచ్చే పరిస్థితి ఏర్పడింది. మరొక అతను ఇసుక లారీల కోసం చేసిన కాల్స్‌తో మరో మంత్రికి మచ్చ తెచ్చింది. మంత్రుల ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది. ఈ ఇద్దరు చేసిన గండాల నుంచి, మంత్రులు ఇలా బయటపడ్డారో లేదో మళ్లీ వచ్చి వాలిపోయారు. మంత్రుల దగ్గర తమ తడాఖా చూపెడుతున్నారు. అయితే, పోయిందనుకున్న గండం మళ్లీ రావడంతో ఉమ్మడి వరంగల్ నేతలు, అధికారులు ఇబ్బంది పడుతున్నారు.

News December 18, 2025

మంచిర్యాలలో ఎక్కువ.. ఆసిఫాబాద్‌లో తక్కువ!

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 3వ విడత పంచాయతీ ఎన్నికల్లో 87.78 శాతం పోలింగ్‌తో మంచిర్యాల జిల్లా ముందు వరుసలో నిలిచింది. అదిలాబాద్ జిల్లాలో 86.94%, నిర్మల్ జిల్లాలో 84.99%, ఆసిఫాబాద్ జిల్లాలో 83.32%, పోలింగ్ నమోదు అయ్యింది. 20 మండలాల్లో జరిగిన 3వ విడతలో 3,97,259 ఓటర్లుండగా, వారిలో 3.34 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.