News February 15, 2025
MNCL: సకాలంలో వైద్యం అందకే శిశువు మృతి: సీపీఎం

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రిలో సకాలంలో వైద్యం అందనందునే నిండు గర్భిణి కడుపులోనే శిశువు మరణించిందని సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవి, జిల్లా కమిటీ సభ్యులు దుంపల రంజిత్ కుమార్ ఆరోపించారు. శుక్రవారం వారు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. రెండు రోజులుగా బాధితురాలు,కుటుంబ సభ్యులు డాక్టర్లను వేడుకున్న కనికరం చూపించలేదన్నారు. వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News November 28, 2025
జగిత్యాల: ‘పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి’

గ్రామ పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల కలెక్టరేట్లో ఆర్వోలకు, ఏఆర్వోలకు శుక్రవారం నిర్వహించిన ఫేజ్ 2 శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. ఎన్నికల నిర్వహణపై అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. నామినేషన్లు చాలా ముఖ్యమైన అంశమని, దీనిపై చాలా కేసులు అయ్యే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి అంశం నిబంధన ప్రకారం జరిగేలా చూడాలన్నారు.
News November 28, 2025
జగిత్యాల: ‘పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి’

గ్రామ పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల కలెక్టరేట్లో ఆర్వోలకు, ఏఆర్వోలకు శుక్రవారం నిర్వహించిన ఫేజ్ 2 శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. ఎన్నికల నిర్వహణపై అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. నామినేషన్లు చాలా ముఖ్యమైన అంశమని, దీనిపై చాలా కేసులు అయ్యే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి అంశం నిబంధన ప్రకారం జరిగేలా చూడాలన్నారు.
News November 28, 2025
సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

డిసెంబర్ 2న కొత్తగూడెం ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఈ నేపథ్యంలో పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను శుక్రవారం కలెక్టర్ జితేష్ వి పాటిల్ సమగ్రంగా పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. విశ్వవిద్యాలయంలోని అన్ని విభాగాలను ఇంజనీరింగ్, R&B, విద్యుత్, పోలీస్ శాఖ, మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు.


