News February 15, 2025
MNCL: సకాలంలో వైద్యం అందకే శిశువు మృతి: సీపీఎం

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రిలో సకాలంలో వైద్యం అందనందునే నిండు గర్భిణి కడుపులోనే శిశువు మరణించిందని సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవి, జిల్లా కమిటీ సభ్యులు దుంపల రంజిత్ కుమార్ ఆరోపించారు. శుక్రవారం వారు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. రెండు రోజులుగా బాధితురాలు,కుటుంబ సభ్యులు డాక్టర్లను వేడుకున్న కనికరం చూపించలేదన్నారు. వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News December 6, 2025
APPLY NOW: ECHSలో ఉద్యోగాలు

విశాఖపట్నంలోని <
News December 6, 2025
పల్నాడు: వైద్యాధికారుల నిర్లక్ష్యం.. ఆందోళనలో ప్రజలు

పల్నాడు జిల్లాలో వైద్యశాఖ అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దొండపాడు పీహెచ్సీలో టైమ్కు ముందే తాళాలు వేసిన ఘటన మరవకముందే, నరసరావుపేట ప్రభుత్వాసుపత్రిలో కలకలం రేగింది. ఓ మహిళకు సర్జరీ చేసిన వైద్యుడు ఆమె శరీరంలో బ్లేడ్ మర్చిపోయినట్లు బయటపడటంతో వైద్యుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
News December 6, 2025
పాక్, అఫ్గాన్ సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తతలు

పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. సరిహద్దుల్లో నిన్న రాత్రి పెద్ద ఎత్తున కాల్పులు చోటుచేసుకున్నాయి. స్పిన్ బోల్డక్ జిల్లాలో పాక్ దళాలు దాడులు ప్రారంభించాయని అఫ్గాన్ చెప్పింది. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకున్నా చమన్ సరిహద్దులో అఫ్గాన్ కాల్పులు జరిపిందని పాక్ ఆరోపించింది. 2 దేశాల మధ్య శాంతి చర్చలు పురోగతి లేకుండా ముగిసిన నేపథ్యంలో ఈ ఘటనలు జరగడం గమనార్హం.


