News February 6, 2025

MNCL: సింగరేణిలో డిపెండెంట్లకు శుభవార్త

image

సింగరేణి కంపెనీలో డిపెండెంట్ల వయస్సు 35 నుంచి 40 సంవత్సరాలకు పెంచుతూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. సంస్థలో పనిచేస్తూ మృతి చెందడంతో పాటు మెడికల్ అన్ ఫిట్ అయిన ఉద్యోగుల వారసులకు 2018 మార్చి 9 నుంచి ఈ గరిష్ట వయోపరిమితి సడలింపు స్కీమ్‌ వర్తించనుంది. దీనివల్ల 2018 నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి తక్షణ ప్రయోజనం చేకూరనుండగా రానున్న రోజుల్లోనూ మరింత మందికి లబ్ధి చేకూరుతుంది.

Similar News

News February 6, 2025

HYD: ఒకే రోజు 10 మంది మృతి!

image

HYDలో విషాద ఘటనలు వెలుగుచూశాయి. నిన్న ఒక్కరోజే 10 మంది చనిపోయారు. LBనగర్‌‌లో గోడ కూలి ముగ్గురు మృతి చెందారు. గచ్చిబౌలిలో రిటోజ, SRనగర్‌లో అమర్‌జిత్, రాయదుర్గంలో ధర్మప్రధాన్, షాద్‌నగర్‌లో నీరజ్, చెరువులో దూకి పీర్జాదిగూడ వాసి బాలరాజు, మీర్‌పేటలో వెంకటేశ్ ఆత్మహత్య చేసుకున్నారు. వేర్వేరు కారణాలతో ఆరుగురు సూసైడ్ చేసుకోగా.. శంకర్‌పల్లిలో బస్ ఢీ కొని బీటెక్ విద్యార్థి మృతి చెందడం బాధాకరం.

News February 6, 2025

సంగారెడ్డిలో తగ్గిన చికెన్ ధరలు

image

సంగారెడ్డి జిల్లాలో చికెన్ ధరలు తగ్గాయి. వారం రోజుల క్రితం కిలో రూ.220పైగానే అమ్మారు. గురువారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. కిలో స్కిన్‌లెస్ KG రూ.210 నుంచి రూ.220, విత్ స్కిన్ రూ.180 నుంచి రూ.190 మధ్య విక్రయిస్తున్నారు. హోల్ సేల్ దుకాణాల్లో రూ.5 నుంచి రూ.10 వరకు తగ్గించి అమ్ముతున్నారు. పౌల్ట్రీ పరిశ్రమల్లో H5N1 వైరస్‌ వల్ల కోళ్లు చనిపోవడంతో ధరలు తగ్గడానికి కారణమని తెలుస్తోంది.

News February 6, 2025

పెద్దపల్లి జిల్లాలో ఉష్ణోగ్రత వివరాలు..

image

పెద్దపల్లి జిల్లాలో రోజురోజుకు చలి తీవ్రత తగ్గుముఖం పడుతుంది. గడచిన 24 గంటల్లో అత్యల్పంగా సుల్తానాబాద్ 18.0℃, రామగుండం 18.3, ఓదెల 18.3, కాల్వ శ్రీరాంపూర్ 18.6, మంథని 18.7, అంతర్గం 18.8, పాలకుర్తి 18.9, ఎలిగేడు 19.2, జూలపల్లి 19.2, ధర్మారం 19.7, పెద్దపల్లి 19.7, కమాన్పూర్ 20.4, రామగిరి 21.9, ముత్తారం 22.1℃గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

error: Content is protected !!