News February 6, 2025

MNCL: సింగరేణిలో డిపెండెంట్లకు శుభవార్త

image

సింగరేణి కంపెనీలో డిపెండెంట్ల వయస్సు 35 నుంచి 40 సంవత్సరాలకు పెంచుతూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. సంస్థలో పనిచేస్తూ మృతి చెందడంతో పాటు మెడికల్ అన్ ఫిట్ అయిన ఉద్యోగుల వారసులకు 2018 మార్చి 9 నుంచి ఈ గరిష్ట వయోపరిమితి సడలింపు స్కీమ్‌ వర్తించనుంది. దీనివల్ల 2018 నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి తక్షణ ప్రయోజనం చేకూరనుండగా రానున్న రోజుల్లోనూ మరింత మందికి లబ్ధి చేకూరుతుంది.

Similar News

News October 30, 2025

చరిత్రలో భారీ లేఆఫ్స్ ఇవే..

image

కరోనా తర్వాత అగ్రశ్రేణి కంపెనీల్లోనూ లేఆఫ్స్ పెరుగుతున్నాయి. తాజాగా ప్రపంచవ్యాప్తంగా 14వేల మందిని తొలగించిన అమెజాన్.. మరో 16వేల మందిపై వేటుకు సిద్ధమవుతోంది. అయితే కరోనా కంటే ముందు కూడా కొన్ని సంస్థలు నష్టాల వల్ల భారీ లేఆఫ్స్ ఇచ్చాయి. 1993లో IBM 60వేల జాబ్స్, సిటీ గ్రూప్ 2008-09లో 75K, 2009లో జనరల్ మోటార్స్ 47K, 2012-15లో హ్యూలెట్-ప్యాకర్డ్ 55K ఉద్యోగాలకు కోత పెట్టాయి.

News October 30, 2025

వరద బాధితులను పరామర్శించిన మంత్రి కొండా

image

మొంథా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరంగల్ జిల్లాలో అనేక ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ గురువారం ఎన్‌.ఎన్‌. నగర్‌లోని వరద బాధితులను పరామర్శించారు. అవసరమైన సహాయం అందేలా తక్షణ చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. ముంపు ప్రాంతాల్లో ఎవరూ ఇబ్బందులు పడకూడదని, ఆహారం, తాగునీరు, వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

News October 30, 2025

మేడిపల్లి: కులం పేరుతో దూషించి దాడి.. వ్యక్తికి జైలు

image

మేడిపల్లి మండలం కల్వకోటకి చెందిన గోడ వెంకటిపై కులం పేరుతో దూషించి దాడి చేసిన కేసులో అదే గ్రామానికి చెందిన ఆదె చందుకు ఏడాది జైలు శిక్ష, రూ.500 జరిమానా విధిస్తూ కరీంనగర్ మూడో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి నీరజ తీర్పునిచ్చారు. 2020 జనవరి 21న బర్రెను ఢీకొట్టిన ఘటనపై మాటామాటా పెరిగి చందు వెంకటిని తిడుతూ దాడి చేశాడు. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన అధికారులను SP అశోక్ కుమార్ అభినందించారు.