News March 11, 2025
MNCL: సింగరేణిలో పలువురు అధికారులు బదిలీ

సింగరేణిలో పలువురు అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కేకే 5 డిప్యూటీ మేనేజర్ వి.ప్రవీణ్, ఆర్కే ఓసీ మేనేజర్ సుధీర్ జయవంత్ రావు, అడిషనల్ మేనేజర్ క్రిషన్ వినోద్ కుమార్, ఎస్ఈ ప్రశాంత్ జీవన్, శాంతిఖని అడిషనల్ మేనేజర్ గంగాప్రసాద్ రాయ్, ఆర్కే 1ఏ డీవైఎస్ఈ లక్ష్మీనారాయణ, ఎస్ఆర్పీ ఓసీ2 మేనేజర్ బ్రహ్మాజీ రావు, ఆర్కే 5 సీనియర్ అండర్ మేనేజర్ శరత్, ఖైరిగూడ ఓసీ ఎస్ఈ సూర్యనారాయణ బదిలీ అయ్యారు.
Similar News
News November 23, 2025
HYD: సమయం లేదు మిత్రమా.. పనులు చకచకా

మరో రెండువారాల్లో (డిసెంబర్ 8,9) ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం కానున్నసంగతి తెలిసిందే. దీంతో అధికారులు మీర్ఖాన్పేట వద్ద పనులు చకచకా చేయిస్తున్నారు. దాదాపు 120 ఎకరాలను చదును చేయిస్తున్నారు. పనులపై ఏరోజుకారోజు ఉన్నతాధికారులు ప్రభుత్వానికి అప్డేట్ ఇస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో పనుల్లో ఆలస్యం జరగరాదని ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్లు సమాచారం. దీంతో నిరంతరం పనులు చేయిస్తున్నారు.
News November 23, 2025
సిరిసిల్లకు అరుదైన గౌరవం

KNR DCC అధ్యక్షుడిగా నియమితులైన చొప్పదండి MLA మేడిపల్లి సత్యం స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేట. గతంలో గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన కటకం మృత్యుంజయం కరీంనగర్ శాసనసభ్యులుగా ఎన్నికై ఉమ్మడి కరీంనగర్ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. తాజాగా సత్యం KNR DCC అధ్యక్షుడిగా నియమితులు కావడంతో సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన రెండోవ్యక్తిగా పేరు సంపాదించుకున్నారు.
News November 23, 2025
HYD: వీకెండ్ డ్రంక్& డ్రైవ్లో 468 మంది దొరికారు

సైబరాబాద్లో వీకెండ్ డ్రంక్& డ్రైవ్లో 468 మంది పట్టుబడ్డారు. వాహనాల వారీగా 335 టూవీలర్లు, 25 ఆటోలు, 107 కార్లు, 1 హెవీ వెహికల్ సీజ్ చేశారు. మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే ప్రమాదం జరిగితే BNS సెక్షన్ 105 కింద 10 ఏళ్ల జైలు శిక్ష వర్తిస్తుందని పోలీసులు హెచ్చరించారు. గత వారం 681 కేసులు డిస్పోజ్ కాగా.. 613 మందికి ఫైన్, 50 మందికి ఫైన్+ సర్వీస్, 18 మందికి ఫైన్+ జైలు శిక్ష విధించారు.


