News February 28, 2025
MNCL: సింగరేణి సీఎండీ సాహసోపేత చర్య

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగంలో ప్రమాద ఘటన స్థలం సమీపంలోకి శుక్రవారం సింగరేణి రెస్క్యూ బృందాలు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రెస్క్యూ సభ్యుల్లో మనోధైర్యం నింపేలా సంస్థ సీఎండీ ఎన్. బలరామ్ సాహసోపేత చర్యలు చేపట్టారు. రెస్క్యూ బృందంతో కలిసి సొరంగంలోకి లోకో రైలులో వెళ్ళారు. వారం రోజులుగా కేంద్ర, రాష్ట్ర బృందాలతో సహాయక చర్యల్లో సింగరేణి బృందం నిమగ్నం కాగా.. మరో 200 మంది సభ్యులు చేరుకున్నారు.
Similar News
News October 16, 2025
SRCL: ‘పెండింగ్ ఓటర్ దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి’

పెండింగ్లో ఉన్న ఓటర్ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సి. సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. ఓటర్ల జాబితా, ఇతర అంశాలపై గురువారం ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఎం. హరిత పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చూడాలని సీఈఓ సూచించారు.
News October 16, 2025
నారాయణపేట కలెక్టరేట్లో అధికారులకు CPRపై శిక్షణ

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నారాయణపేట కలెక్టరేట్ సమావేశ మందిరంలో CPR (Cardio Pulmonary Resuscitation)పై జిల్లా అధికారులకు ఈరోజు ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొని మాట్లాడుతూ.. “ప్రస్తుతం హార్ట్ అటాక్ కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే అత్యవసర పరిస్థితుల్లో CPR ద్వారా ప్రాణాలను కాపాడవచ్చు” అని తెలిపారు.
News October 16, 2025
నారాయణపేట జిల్లా ఎస్పీ ముఖ్య గమనిక

నారాయణపేట జిల్లాలో బాణాసంచా విక్రయదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని ఎస్పీ డాక్టర్ వినీత్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 1884, 2008 చట్టాల ప్రకారం అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పారు. పెట్రోల్ బంకు, రద్దీ స్థలాలు, ట్రాన్స్ఫార్మర్, వివాదాస్పద స్థలాల్లో దుకాణాలు ఏర్పాటు చేయొద్దని సూచించారు. తహశీల్దార్, పోలీసులు చూపించిన స్థలంలోనే బాణాసంచా దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు.