News February 28, 2025
MNCL: సింగరేణి సీఎండీ సాహసోపేత చర్య

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగంలో ప్రమాద ఘటన స్థలం సమీపంలోకి శుక్రవారం సింగరేణి రెస్క్యూ బృందాలు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రెస్క్యూ సభ్యుల్లో మనోధైర్యం నింపేలా సంస్థ సీఎండీ ఎన్. బలరామ్ సాహసోపేత చర్యలు చేపట్టారు. రెస్క్యూ బృందంతో కలిసి సొరంగంలోకి లోకో రైలులో వెళ్ళారు. వారం రోజులుగా కేంద్ర, రాష్ట్ర బృందాలతో సహాయక చర్యల్లో సింగరేణి బృందం నిమగ్నం కాగా.. మరో 200 మంది సభ్యులు చేరుకున్నారు.
Similar News
News July 6, 2025
HYD: 95 ఏళ్లు.. చెక్కుచెదరని అషుర్ఖానా!

HYDలోని ‘అజా ఖానే జెహ్రా’ అషుర్ఖానా మొహర్రం సందర్భంగా ప్రత్యేక ఆకర్షణగా మారింది. 1930లో చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తల్లి జెహ్రా బేగం జ్ఞాపకార్థం నిర్మించిన ఈ అషుర్ఖానా దక్షిణ భారతదేశంలో అతిపెద్దదిగా నిలిచిందని చరిత్రకారులు చెబుతున్నారు. శియా భక్తుల పవిత్ర స్థలంగా పేరుగాంచిన ఈ కట్టడం మూసీ నది ఒడ్డున ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. నేడు ఈ దుఃఖ మందిరానికి భారీగా ముస్లింలు తరలిరానున్నారు.
News July 6, 2025
తొలి ఏకాదశి రోజు ఏం చేయాలంటే?

ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి/శయన ఏకాదశి అంటారు. ఈరోజు నుంచి విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తారని నమ్ముతారు. ఉదయాన్నే తలస్నానం చేసి విష్ణువును తులసి దళాలతో పూజిస్తారు. ఈరోజు పూజించడం వల్ల ఆయన అనుగ్రహం లభిస్తుందని, ఏకాదశి రోజున ఉపవాసముంటే మోక్షం కలుగుతుందని నమ్ముతారు. అలాగే ఈ ఒక్కరోజు ఉపవాసముంటే సంవత్సరంలోని అన్ని ఏకాదశుల ఉపవాస ఫలితం లభిస్తుందని పండితులు చెబుతారు.
News July 6, 2025
HYD: 95 ఏళ్లు.. చెక్కుచెదరని అషుర్ఖానా!

HYDలోని ‘అజా ఖానే జెహ్రా’ అషుర్ఖానా మొహర్రం సందర్భంగా ప్రత్యేక ఆకర్షణగా మారింది. 1930లో చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తల్లి జెహ్రా బేగం జ్ఞాపకార్థం నిర్మించిన ఈ అషుర్ఖానా దక్షిణ భారతదేశంలో అతిపెద్దదిగా నిలిచిందని చరిత్రకారులు చెబుతున్నారు. శియా భక్తుల పవిత్ర స్థలంగా పేరుగాంచిన ఈ కట్టడం మూసీ నది ఒడ్డున ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. నేడు ఈ దుఃఖ మందిరానికి భారీగా ముస్లింలు తరలిరానున్నారు.