News March 21, 2025

MNCL: స్కాలర్షిప్.. APPLY NOW

image

2025 సంవత్సరంలో ఎస్సీ విద్యార్థుల ఉన్నత చదువులకు అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకం ద్వారా ఆర్థిక సహాయం కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి రవీందర్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆర్థిక సహాయం కోసం డిగ్రీ పూర్తయినా లేదా చివరి ఏడాది చదువుతున్న వారు మే 19లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇందుకు https://telanganaepass.cgg.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

Similar News

News December 27, 2025

గ్రేటర్ HYDలో నీటి కష్టాలు

image

HYDలో భూగర్భ జలమట్టాలు వేగంగా పడిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. భూగర్భ జలాల వినియోగం విపరీతంగా పెరగడమే ఇందుకు కారణమని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉప్పల్‌లో 7.6 మీటర్లు, అమీర్‌పేటలో 10.5, కుత్బుల్లాపూర్‌లో అత్యధికంగా 18.7, దారుల్‌షిఫా 7.1, టోలిచౌకి 3.8, రాజేంద్రనగర్ 7.6, శంషాబాద్ 4.6, వికారాబాద్ 4.8 మీటర్ల లోతుకు నీటి మట్టాలు చేరుకున్నట్లు వెల్లడించారు.

News December 27, 2025

జనవరి 3, 4, 5 తేదీల్లో ప్రపంచ తెలుగు మహాసభలు

image

AP: జనవరి 3,4,5 తేదీల్లో గుంటూరు జిల్లాలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 3 రోజుల పాటు 22 సాహితీ సదస్సులు నిర్వహించనుండగా, 4 రాష్ట్రాల గవర్నర్లు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. ఇప్పటికే 40 దేశాలకు చెందిన 62 తెలుగు సంఘాలకు ఆహ్వానాలు పంపారు. NTR పేరిట ప్రధాన వేదిక ఏర్పాటు కానుంది. ఈ సభలకు తెలుగువారి అనురాగ సంగమంగా నామకరణం చేశారు. 3రోజుల్లో లక్ష మంది వస్తారని అంచనా.

News December 27, 2025

నిర్మల్: వార్డు మెంబర్ SUICIDE

image

అప్పుల బాధతో వార్డు మెంబర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన నిర్మల్ జల్లా దిలావర్పూర్ మం. కాల్వలో జరిగింది. SI రవీందర్ ప్రకారం.. గ్రామానికి చెందిన నరేశ్(31) GP ఎన్నికల్లో వార్డు మెంబర్‌గా గెలిచాడు. ఇంటి నిర్మాణం కోసం చేసిన అప్పు ఎలా తీర్చాలో తెలియక కొన్ని రోజులుగా బాధపడుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఇంట్లో ఉరేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.