News March 21, 2025

MNCL: స్కాలర్షిప్.. APPLY NOW

image

2025 సంవత్సరంలో ఎస్సీ విద్యార్థుల ఉన్నత చదువులకు అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకం ద్వారా ఆర్థిక సహాయం కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి రవీందర్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆర్థిక సహాయం కోసం డిగ్రీ పూర్తయినా లేదా చివరి ఏడాది చదువుతున్న వారు మే 19లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇందుకు https://telanganaepass.cgg.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

Similar News

News October 15, 2025

DSSSBలో 1180 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

ఢిల్లీలో 1180 అసిస్టెంట్ టీచర్ (ప్రైమరీ) పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఇంటర్, DEd లేదా B.EI.Ed, సీటెట్ అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.100, ST, SC, మహిళలు, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు కలదు. రాతపరీక్ష ద్వారా ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. * మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

News October 15, 2025

కర్నూలులో రేపు ట్రాఫిక్ మళ్లింపు

image

రేపు ప్రధాని <<18009233>>మోదీ<<>> కర్నూలు పర్యటన నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ మార్గాలు మళ్లింపు ఉంటాయని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. కడప నుంచి కర్నూలు మీదుగా హైదరాబాద్ వెళ్తున్న వాహనాలు కొల్లబాపురం, పూడూరు, అలంపూర్ బ్రిడ్జి, అలంపూర్ చౌరస్తా మార్గంలో వెళ్లాలని సూచించారు. ఇతర ప్రాంతాల వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల సూచనలను అనుసరించాలని తెలిపారు.

News October 15, 2025

కేతిరెడ్డి పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

image

తాడిపత్రికి వెళ్లినప్పటికీ పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచుతున్నారంటూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సుప్రీంకోర్టులో మిసిలేనియస్ అప్లికేషన్‌ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘ఇప్పటికే మీకు రక్షణ కల్పించాం, ఇంకేం కావాలి?’ అంటూ న్యాయమూర్తులు ప్రశ్నించారు. అనంతరం కేతిరెడ్డి పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించారు.