News March 8, 2025
MNCL: స్ట్రక్చర్ సమావేశంలో పలు అంశాలపై ఒప్పందం

సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీతో శుక్రవారం జరిగిన సీఅండ్ఎండీ స్థాయి స్ట్రక్చర్ సమావేశంలో అంశాలపై చర్చించి ఒక ఒప్పందానికి వచ్చారు. పెర్క్స్ పై ఐటీ చెల్లించడంపై కమిటీ ఏర్పాటు, సొంత ఇంటి పథకం అమలు, అన్ని రకాల మజ్దూర్ల డిజిగ్నేషన్ మార్చుటకు, డిస్మిస్ కార్మికులకు ఐదేళ్ళలో ఏదైనా ఒక ఏడాదిలో 100 మాస్టర్లు ఉంటే ఒక అవకాశం కల్పించాలని నిర్ణయించారు.
Similar News
News December 16, 2025
NTR: న్యూ ఇయర్ కానుకగా ‘ఆంధ్ర టాక్సీ యాప్’

ఆటో, టాక్సీ డ్రైవర్ల కోసం కమిషన్ లేకుండా ‘ఆంధ్ర టాక్సీ’ యాప్ను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఓలా, రాపిడోలో 30% వరకు కమిషన్ తీసుకుంటున్న నేపథ్యంలో ఇది ఉపశమనం కలిగించనుంది. ఈ యాప్ను మొదట ఎన్టీఆర్ జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద జనవరి 1న ప్రారంభించనున్నారు. దీనిని పర్యాటక ప్రాంతాలకు అనుసంధానించి ప్రత్యేక ప్యాకేజీలు అందించనున్నారు. రేపటి నుంచి డ్రైవర్లకు అవగాహన కల్పిస్తారు.
News December 16, 2025
తూ.గో: ధనుర్మాసం వచ్చేసింది.. సంక్రాంతి సందడి తెచ్చేసింది..!

ధనుర్మాసం వచ్చేసింది. మంచు తెరలు గోదారి అలలను ముద్దాడుతున్న వేళ పల్లె గుండెల్లో సంక్రాంతి సవ్వడి మొదలైంది. బరిలోకి కాలు దువ్వేందుకు పందెం కోళ్లు సై అంటుంటే, అత్తారింటికి రావడానికి కొత్త అల్లుళ్ల ఎదురు చూస్తున్నారు. సిటీల్లో ఉన్నా సరే, మనసుని లాగేసే గోదారి మట్టి వాసన, అమ్మమ్మ గారి ఊరి జ్ఞాపకాలు సంక్రాంతి ప్రత్యేకత. ఇది కేవలం పండగ కాదు.. గోదారోడి గతాన్ని, వర్తమానాన్ని ముడివేసే ఒక తీయని అనుభూతి.
News December 16, 2025
కడప జిల్లాలో కొత్త ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్

కడప జిల్లాలో విండ్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు హెటిరో సంస్థకు భూములు కేటాయిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. జిల్లాలోని కొండాపురం మండలం టి.కోడూరులో 30 ఎకరాలు, చామలూరు గ్రామంలో 10 ఎకరాలు, కొప్పోలులో 5 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఎకరాకు ఏడాదికి రూ.3 లక్షలు లీజు ప్రాతిపాదికన భూములు కేటాయించారు.


