News February 10, 2025

MNCL: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం

image

మంచిర్యాల జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు ముమ్మరం చేశారు. జిల్లాలోని 16 మండలాల్లో గతంలో 130 ఎంపీటీసీ స్థానాలు ఉండగా మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 3 స్థానాలు విలీనమయ్యాయి. దీంతో కొత్తగా భీమిని, భీమారం మండలాల్లో అదనంగా 2 స్థానాలను పెంచారు. కాగా జిల్లాలో మొత్తం మొత్తం 129 ఎంపీటీసీ స్థానాలు, 16 జడ్పీటీసీ స్థానాలు, 16 ఎంపీపీ స్థానాలు ఉన్నాయి.

Similar News

News November 18, 2025

వారికి నోటీసులు అందించండి: MHBD ZP CEO

image

ఇల్లు మంజూరైనా ఇప్పటిద వరకు నిర్మాణం మొదలుపెట్టని వారికి నోటీసులు జారీ చేసి, పనులు మొదలు పెట్టేలా చూడాలని అధికారులకు ZP CEO పురుషోత్తం సూచించారు. మరిపెడ మండలం MPDO వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. మండలంలో 104 ఇందిరమ్మ ఇండ్లు ఇంకా మొదలు పెట్టలేదని, మంజూరైన ఇండ్ల లబ్ధిదారులతో అధికారులు మాట్లాడాలని చెప్పారు. ఇందిరమ్మ కమిటీలతో సమావేశం నిర్వహించి వారికి నోటీసులు అందజేయాన్నారు.

News November 18, 2025

వారికి నోటీసులు అందించండి: MHBD ZP CEO

image

ఇల్లు మంజూరైనా ఇప్పటిద వరకు నిర్మాణం మొదలుపెట్టని వారికి నోటీసులు జారీ చేసి, పనులు మొదలు పెట్టేలా చూడాలని అధికారులకు ZP CEO పురుషోత్తం సూచించారు. మరిపెడ మండలం MPDO వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. మండలంలో 104 ఇందిరమ్మ ఇండ్లు ఇంకా మొదలు పెట్టలేదని, మంజూరైన ఇండ్ల లబ్ధిదారులతో అధికారులు మాట్లాడాలని చెప్పారు. ఇందిరమ్మ కమిటీలతో సమావేశం నిర్వహించి వారికి నోటీసులు అందజేయాన్నారు.

News November 18, 2025

పెద్దపల్లి: అభివృద్ధి పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి: కలెక్టర్

image

RGM కార్పొరేషన్ పనితీరుపై జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీక్ష నిర్వహించారు. నగర అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. TUIDF నిధులను సకాలంలో, నాణ్యతతో వినియోగించాలని సూచించారు. ఆదాయ వనరులను పెంచడంపై దృష్టి సారించి, ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్స్ వసూళ్లను 100 శాతం పూర్తి చేయాలన్నారు. పారిశుధ్యాన్ని పటిష్టం చేసి, రోడ్లపై చెత్త లేకుండా చూడాలని కలెక్టర్ స్పష్టం చేశారు.