News February 10, 2025
MNCL: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం

మంచిర్యాల జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు ముమ్మరం చేశారు. జిల్లాలోని 16 మండలాల్లో గతంలో 130 ఎంపీటీసీ స్థానాలు ఉండగా మున్సిపల్ కార్పొరేషన్లో 3 స్థానాలు విలీనమయ్యాయి. దీంతో కొత్తగా భీమిని, భీమారం మండలాల్లో అదనంగా 2 స్థానాలను పెంచారు. కాగా జిల్లాలో మొత్తం మొత్తం 129 ఎంపీటీసీ స్థానాలు, 16 జడ్పీటీసీ స్థానాలు, 16 ఎంపీపీ స్థానాలు ఉన్నాయి.
Similar News
News March 13, 2025
ప్రశాంత వాతావరణంలో హోలీ పండుగ జరుపుకోవాలి: ఎస్పీ

హోలీ పండుగను శుక్రవారం ఉదయం 6:00 గంటల నుంచి మ.12 గంటల వరకు చేసుకోవాలని సురక్షితమైన రంగులను ఉపయోగించాలని హానికరమైన రసాయనాలను రంగులను వాడకూడదని గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇష్టపడని వ్యక్తులు, ప్రదేశాలు, వాహనాలపై రంగులు లేదా రంగు నీటిని విసరడం కఠినంగా నిషేధిస్తున్నాని, అలాచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
News March 13, 2025
కేటిదొడ్డి: ‘చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలి’

నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ఎడమ కాలువ 104వ ప్యాకేజీ చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలని గద్వాల కలెక్టర్ సంతోష్ ఇరిగేషన్ అధికారులకు సూచించారు. గురువారం కేటిదొడ్డి మండలం గువ్వలదిన్నె, కొండాపురం, మైలగడ్డ గ్రామాల వద్ద సాగునీటి ఆవశ్యకత గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సాగునీటి కాలువలను పరిశీలించారు. రైతుల అభ్యర్థన మేరకు వెంటనే సాగునీరు విడుదల చేయాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు.
News March 13, 2025
తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం

త్రిభాషా వివాదం నేపథ్యంలో తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ కాపీపై రూపీ సింబల్(₹)ను తొలగించింది. రూపీ సింబల్కు బదులు తమిళ ‘రూ’ అక్షరాన్ని పేర్కొంది.