News February 10, 2025
MNCL: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం

మంచిర్యాల జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు ముమ్మరం చేశారు. జిల్లాలోని 16 మండలాల్లో గతంలో 130 ఎంపీటీసీ స్థానాలు ఉండగా మున్సిపల్ కార్పొరేషన్లో 3 స్థానాలు విలీనమయ్యాయి. దీంతో కొత్తగా భీమిని, భీమారం మండలాల్లో అదనంగా 2 స్థానాలను పెంచారు. కాగా జిల్లాలో మొత్తం మొత్తం 129 ఎంపీటీసీ స్థానాలు, 16 జడ్పీటీసీ స్థానాలు, 16 ఎంపీపీ స్థానాలు ఉన్నాయి.
Similar News
News December 8, 2025
ఆదోని జిల్లా ప్రజల ఆకాంక్ష!

ఆదోని జిల్లా సాధనపై అన్ని వర్గాలు కదం తొక్కుతున్నాయి. నెల రోజులుగా నిరసనలు చేస్తూ జిల్లాతోనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అందరూ అభిప్రాయపడుతున్నారు. జిల్లా ఏర్పాటు సాధ్యసాధ్యాలపై జిల్లా నేతలు చర్చించి తనకు నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించడంతో పశ్చిమ ప్రాంత ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాలతో జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉంది.
News December 8, 2025
మైసూరు పప్పు మాంసాహారమా?

పూజలు, వ్రతాల సమయంలో మైసూరు పప్పు తినకూడదంటారు. దీన్ని మాంసాహారంగా కూడా కొందరు భావిస్తారు. ఇందులో బద్ధకాన్ని కలిగించే తామస గుణాలుండటం అందుకు తొలి కారణం. అలాగే ఓ రాక్షసుడి రక్తం బొట్టు నుంచి ఈ పప్పు పుట్టిందని కొందరు పండితులు పేర్కొంటారు. పాల సముద్రాన్ని చిలకగా వచ్చిన అమృతాన్ని దొంగచాటుగా తాగిన సర్భాను తలను విష్ణు సుదర్శన చక్రంతో ఖండించాడట. ఆ రక్తపు చుక్కలు పడిన చోట ఇవి మొలిచాయని నమ్ముతారు.
News December 8, 2025
ఫైబ్రాయిడ్స్ లక్షణాలివే..

ఫైబ్రాయిడ్స్ ఉన్న మహిళల్లో నెలసరి స్రావంలో రక్తపు గడ్డలు కనిపించడం, నొప్పి ఉంటాయి. ఒకవేళ ఫైబ్రాయిడ్స్ చాలా పెద్దవిగా ఉంటే మూత్రాశయం మీద ఒత్తిడి పడి తరచూ మూత్రవిసర్జన చేయవలసి రావడం, మూత్రవిసర్జన పూర్తిగా జరగకపోవడం, జీర్ణ సమస్యలు వంటివి మొదలవుతాయి. కొన్ని రకాల ఫైబ్రాయిడ్లు గర్భసంచి లోపలి పొరల్లో ఏర్పడతాయి. వీటి వల్ల గర్భస్రావం జరిగిపోవడం, గర్భం దాల్చలేకపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి.


