News February 10, 2025
MNCL: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం

మంచిర్యాల జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు ముమ్మరం చేశారు. జిల్లాలోని 16 మండలాల్లో గతంలో 130 ఎంపీటీసీ స్థానాలు ఉండగా మున్సిపల్ కార్పొరేషన్లో 3 స్థానాలు విలీనమయ్యాయి. దీంతో కొత్తగా భీమిని, భీమారం మండలాల్లో అదనంగా 2 స్థానాలను పెంచారు. కాగా జిల్లాలో మొత్తం మొత్తం 129 ఎంపీటీసీ స్థానాలు, 16 జడ్పీటీసీ స్థానాలు, 16 ఎంపీపీ స్థానాలు ఉన్నాయి.
Similar News
News December 23, 2025
KMR: నమస్తే సర్పంచ్ సాబ్! ఇక పల్లెల్లో అభివృద్ధి పరుగులే

కామారెడ్డి జిల్లాలో గ్రామ పంచాయతీల్లో రెండేళ్ల నిరీక్షణకు తెరపడింది. తాజాగా ఎన్నికైన సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు గ్రామాభివృద్ధికి, ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. నేటి నుండి పూర్తిస్థాయి పాలన ప్రారంభం కావడంతో, ఆగిపోయిన అభివృద్ధి పనులు ఇకపై ఊపందుకోనున్నాయి.
News December 23, 2025
HYD: నేడో, రేపో డీ లిమిటేషన్ ఫైనల్

GHMCని 300 వార్డులుగా పునర్విభజన చేస్తూ వెలువడిన ప్రాథమిక నోటిఫికేషన్పై అభ్యంతరాలను GHMC యంత్రాంగం పరిగణలోకి తీసుకొని మార్పులు, చేర్పులు చేసింది. దీనికి అనుగుణంగా ఫైనల్ నోటిఫికేషన్ ప్రభుత్వ ఆమోదంతో నేడో, రేపో వెలువడే అవకాశం ఉంది. కాగా, కార్పొరేటర్లతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వ్యక్తం చేసిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని తుది నివేదికను సోమవారం ప్రభుత్వానికి అధికారులు పంపించారు.
News December 23, 2025
మేడారం: ఇంకా 36 రోజులే.. SLOWగా పనులు..!

మేడారం జాతరకు మరో 36 రోజులే గడువు ఉంది. సాధారణంగా జాతరకు 15 రోజుల ముందు నుంచే అమ్మవార్లను దర్శించుకునేందుకు జనం వస్తుంటారు. కాగా, జాతర ప్రాంతంలో అభివృద్ధి పనులు నెమ్మదిగా సాగుతన్నాయి. మరోపక్క మేడారానికి చేరుకునే రోడ్లపై ఉన్న వంతెనలు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. సమ్మక్క మాల ధరించి మరీ అధికారులుందరూ ఇక్కడే ఉండి జాతర పనులు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినా అలాంటి పరిస్థితేమీ కన్పించట్లేదు.


