News February 10, 2025
MNCL: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం

మంచిర్యాల జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు ముమ్మరం చేశారు. జిల్లాలోని 16 మండలాల్లో గతంలో 130 ఎంపీటీసీ స్థానాలు ఉండగా మున్సిపల్ కార్పొరేషన్లో 3 స్థానాలు విలీనమయ్యాయి. దీంతో కొత్తగా భీమిని, భీమారం మండలాల్లో అదనంగా 2 స్థానాలను పెంచారు. కాగా జిల్లాలో మొత్తం మొత్తం 129 ఎంపీటీసీ స్థానాలు, 16 జడ్పీటీసీ స్థానాలు, 16 ఎంపీపీ స్థానాలు ఉన్నాయి.
Similar News
News November 17, 2025
కేయూ: ఆ సభ్యుల నియామకంపై SFI తీవ్ర అభ్యంతరం

కాకతీయ యూనివర్సిటీ విచారణ కమిటీల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులను సభ్యులుగా పెట్టడాన్ని SFI తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. గత కమిటీ నివేదికలపై చర్యలు తీసుకోకపోవడం అధికార దుర్వినియోగమని పేర్కొంటూ ప్రిన్సిపల్, హాస్టల్ ఛైర్మన్ ఆధ్వర్యంలో కొత్త కమిటీ ఏర్పాటుకు విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. అందుకు సంబంధించి ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ప్రొఫెసర్ రామచంద్రానికి వినతిపత్రం అందించింది.
News November 17, 2025
కేయూ: ఆ సభ్యుల నియామకంపై SFI తీవ్ర అభ్యంతరం

కాకతీయ యూనివర్సిటీ విచారణ కమిటీల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులను సభ్యులుగా పెట్టడాన్ని SFI తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. గత కమిటీ నివేదికలపై చర్యలు తీసుకోకపోవడం అధికార దుర్వినియోగమని పేర్కొంటూ ప్రిన్సిపల్, హాస్టల్ ఛైర్మన్ ఆధ్వర్యంలో కొత్త కమిటీ ఏర్పాటుకు విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. అందుకు సంబంధించి ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ప్రొఫెసర్ రామచంద్రానికి వినతిపత్రం అందించింది.
News November 17, 2025
తిరుపతి: చిన్న అప్పన్న బెయిల్ పిటిషన్ డిస్మిస్

నెల్లూరు ఏసీబీ కోర్టులో సోమవారం టీటీడీ కల్తీ నెయ్యి కేసుతో సంబంధం ఉన్న చిన్న అప్పన్న బెయిల్ పిటిషన్ను డిస్మిస్ అయ్యింది. ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాది జయశేఖర్ వాదనలతో ఏకీభవిస్తూ న్యాయమూర్తి బెయిల్ పిటిషన్ను కొట్టివేశారు. 2 సార్లు హవాలా ద్వారా చిన్న అప్పన్న డెయిరీ కంపెనీ ప్రతినిధుల నుంచి రూ.20 లక్షలు, రూ.30 లక్షలు ఢిల్లీ పటేల్ నగర్ వద్ద 2023లో తీసుకున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.


