News February 10, 2025

MNCL: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం

image

మంచిర్యాల జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు ముమ్మరం చేశారు. జిల్లాలోని 16 మండలాల్లో గతంలో 130 ఎంపీటీసీ స్థానాలు ఉండగా మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 3 స్థానాలు విలీనమయ్యాయి. దీంతో కొత్తగా భీమిని, భీమారం మండలాల్లో అదనంగా 2 స్థానాలను పెంచారు. కాగా జిల్లాలో మొత్తం మొత్తం 129 ఎంపీటీసీ స్థానాలు, 16 జడ్పీటీసీ స్థానాలు, 16 ఎంపీపీ స్థానాలు ఉన్నాయి.

Similar News

News March 28, 2025

పెన్షన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేపట్టాలి: కలెక్టర్

image

ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఏప్రిల్ 1న పెన్షన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఎన్టీఆర్ భరోసా పథకం కింద 1న పెన్షన్ల పంపిణీకి సంబంధించిన సన్నద్ధతపై సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉదయం 7 గంటలకు పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలని, ముందుగా వెళ్లరాదని సూచించారు.

News March 28, 2025

2000km దూరం నుంచి గుండె ఆపరేషన్ చేసిన డాక్టర్లు

image

గురుగ్రామ్‌ డాక్టర్లు 2000km దూరంలోని బెంగళూరులో రోగికి అత్యంత సంక్లిష్టమైన గుండె ఆపరేషన్ చేశారు. SS ఇన్నోవేషన్స్ రూపొందించిన స్వదేశీ సర్జికల్ రోబో SSI మంత్ర సాయంతో సర్జరీని విజయవంతం చేశారు. కన్సోల్ వెనక కూర్చున్న డాక్టర్లు 3D గ్లాసెస్ పెట్టుకొని స్క్రీన్‌ చూస్తూ 2:40hrs శ్రమించారు. BLR డాక్టర్లు ఇక్కడ రోబోను అమర్చారు. గతంలో 48KM, 286KMకే సాధ్యమైన టెలీసర్జరీ 2000KM దూరాన చేయడం ఇదే తొలిసారి.

News March 28, 2025

నాడు వైఎస్సార్.. నేడు జగన్ పోలవరానికి అడ్డు: నిమ్మల

image

AP: 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు 72% పోలవరం పనులను పూర్తిచేశారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అప్పట్లో మధుకాన్ కాంట్రాక్ట్‌ను రద్దు చేసి YSR, 2019లో రివర్స్ టెండరింగ్ పేరుతో జగన్ ప్రాజెక్టుకు అడ్డుపడ్డారని ఆరోపించారు. ఇప్పటికీ జగన్ ముఠా సైంధవుల్లా పోలవరం పురోగతికి ఆటంకాలు కలిగిస్తోందని విమర్శించారు. 9 నెలల పాలనలోనే CBN ప్రాజెక్టుకు రూ.5,052 కోట్లు అడ్వాన్స్‌గా సాధించారని చెప్పారు.

error: Content is protected !!