News February 26, 2025
MNCL: అప్పుల బాధతో ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

మంచిర్యాలలోని రాజీవ్నగర్లో రామటెంకి బాణేష్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని SI ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. బాణేశ్కు 2022లో గుండెకు స్టంట్స్ వేశారు. రెండో భార్య పుష్ప వివాహేతర సంబంధం విషయంలో గొడవలు కావడంతో వెంకటేష్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఇద్దరిపై కేసు నమోదై జైలుకు వెళ్లొచ్చారు. ఈ క్రమంలో అప్పులుకావడంతో భార్య పనికి వెళ్లి వచ్చేసరికి ఇంట్లో ఉరేసుకున్నారు.
Similar News
News February 26, 2025
నర్సీపట్నంలో అల్లూరి జిల్లా వాసి మృతి

నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం నడింపాలెం గ్రామానికి చెందిన పనసల చంద్రశేఖర్ ఉరివేసుకున్నాడు. ఉదయాన్నే వాకింగ్కి వెళ్లిన వ్యక్తులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. మృతదేహం వద్ద కాలేజీ బ్యాగ్ దొరికిందని పోలీసులు తెలిపారు. అందులో ఉన్న పర్సులో ఆధార్ కార్డు లభించింది. దాని ఆధారంగా మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
News February 26, 2025
వరంగల్: ముమ్మరంగా తెర వెనుక ప్రచారం..!

టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం బయటకు పెద్దగా కనిపించలేదు. కానీ విద్యా సంస్థలు, రాజకీయ పార్టీలు, కుల సంఘాలు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారాన్ని చేపట్టాయి. ప్రధానంగా విద్యా సంస్థలు ఎక్కువగా ఉన్న HNK, WGLతో పాటు NSPT, JN, MHBD, BHPL పట్టణాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఉమ్మడి జిల్లాలో 11,189 మంది ఓటర్లు ఉన్నారు. వారిని ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు సామ దాన భేద దండోపాయాలను అమలు చేస్తున్నారు.
News February 26, 2025
పిట్లం: రాజీ కాలేదని కన్నతల్లిని కొట్టి చంపేశాడు..!

కన్న తల్లిని కొడుకు చంపిన ఘటన పిట్లంలో మంగళవారం జరిగింది. SI రాజు వివరాలిలా.. సాబేర బేగం(60)కు నలుగురు కొడుకులు, కూతురు ఉన్నారు. రెండో కొడుకైన శాదుల్ నాలుగేళ్ల క్రితం తన తమ్ముడైన ముజిబ్ను కత్తితో పొడిచి చంపాడు. ఈ కేసులో రాజీపడాలని తల్లిని కోరగా ఆమె నిరాకరించింది. దీంతో రోకలి బండతో తలపై దాడి చేయగా.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.