News September 13, 2025
MNCL: ఈనెల 22న PLR బోనస్పై జేబీసీసీఐ సమావేశం

బొగ్గు పరిశ్రమలోని కార్మికులకు దీపావళి పండుగ సందర్భంగా అందించే పనితీరు ఆధారిత రివార్డు (PLR) చెల్లింపుపై ఈనెల 22న ఉదయం 11 గంటలకు న్యూఢిల్లీలో జేబీసీసీఐ సమావేశం జరగనుంది. ఈ మేరకు కోల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గౌతమ్ బెనర్జీ ప్రకటన విడుదల చేశారు. ఈ సమావేశంలో సింగరేణి సంస్థ నుంచి డైరెక్టర్ గౌతమ్ పొట్రుతో పాటు దేశంలోని బొగ్గు పరిశ్రమల డైరెక్టర్లు, జాతీయ కార్మిక సంఘాల నాయకులు పాల్గొంటారు.
Similar News
News September 13, 2025
ముంబై పేలుళ్ల కేసు.. రూ.9 కోట్లు ఇప్పించాలని నిర్దోషి డిమాండ్

2006 ముంబై పేలుళ్ల కేసులో అరెస్టయి 2015లో నిర్దోషిగా విడుదలైన అబ్దుల్ వాహిద్ షేక్ పరిహారం కోరుతూ NHRCని ఆశ్రయించాడు. కస్టోడియల్ టార్చర్ వల్ల ఆరోగ్యం, వ్యక్తిగత జీవితం దెబ్బతిన్నాయని, రూ.9CR ఇప్పించాలని దరఖాస్తు చేశాడు. 2015లో ఈ కేసులో ఐదుగురికి మరణశిక్ష, ఏడుగురికి జీవిత ఖైదు విధించగా, మిగిలిన 12 మంది నిందితులను ఈ ఏడాది జులైలో కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. పేలుళ్ల ఘటనలో 180+ మంది మరణించారు.
News September 13, 2025
‘అనంత జిల్లాకు వర్ష సూచన.. అప్రమత్తంగా ఉండండి’

అనంతపురం జిల్లాలో ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదవుతున్నాయని శాస్త్రవేత్త విజయ్ శంకర్ బాబు తెలిపారు. మేఘాలు కమ్ముకుని అక్కడక్కడ తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. గరిష్ఠ ఉష్ణోగ్రత 33.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 20.0 డిగ్రీల సెల్సియస్గా నమోదవుతుందన్నారు. పశ్చిమ దిశగా గాలులు గంటకు 8 నుంచి 14 కిలోమీటర్ల వేగంతో వీస్తాయన్నారు.
News September 13, 2025
ములుగు: కనుమరుగవుతున్న బతుకమ్మ పాటలు!

బతుకమ్మ పండుగకు ఓరుగల్లు పెట్టింది పేరు. ప్రతి గ్రామంలో ఘనంగా జరుపుకునే సంబురం. 9 రోజులు తీరొక్క పూలతో బతుకమ్మ పేర్చి ఒక్కచోట చేరి జరుపుకునే పండుగ. కానీ, కొన్నేళ్లుగా బతుకమ్మ పాటలు, సంస్కృతి కనుమరుగవుతోంది. డీజేలు, వల్గర్ పాటలతో పండుగ అర్దాన్ని మారుస్తున్నారు. వింత పోకడలు, అర్థం పర్థం లేని పాటలు, విచిత్ర డాన్సులతో పూల పండుగ భవిష్యత్తు తరాలకు తెలియకుండా పోతుంది. కాగా, ఈనెల 22న ఎంగిలి పూల బతుకమ్మ.