News February 23, 2025
MNCL: ఎన్నికలకు సింగరేణి కార్మికులు దూరమేనా..?

ఈనెల 27న జరిగే పట్టభద్రుల ఎన్నికలకు సింగరేణి కార్మికులకు యాజమాన్యం ఇప్పటి వరకు స్పెషల్ క్యాజువల్ లీవ్ ప్రకటించకలేదు. దీంతో ఓటు హక్కు వినియోగించుకోలేమని సింగరేణి పట్టభద్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వివిధ శాఖల ఉద్యోగులకు స్పెషల్ లీవ్లు ఇస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. కానీ సింగరేణి కార్మికులకు స్పెషల్ లీవ్ ఆదేశాల రాలేదని పలువురు కార్మికులు Way2News దృష్టికి తీసుకువచ్చారు.
Similar News
News July 6, 2025
రేపు అమలాపురంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం

అమలాపురం కలెక్టరేట్ గోదావరి భవన్లో సోమవారం యధావిధిగా పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆర్. మహేశ్ కుమార్ తెలిపారు. అదేవిధంగా జిల్లా పరిధిలోని మూడు రెవెన్యూ డివిజన్ కేంద్రాలు, నాలుగు మున్సిపల్ కార్యాలయాలు, 22 మండల కేంద్రాల్లో అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. ఫిర్యాదుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
News July 6, 2025
స్టాంప్ సవరణ బిల్లుతో ఉపయోగాలివే..

తెలంగాణ స్టాంప్ సవరణ బిల్లు-2025 తేవాలని <<16956370>>ప్రభుత్వం<<>> నిర్ణయించడంపై దీని ఉపయోగాలు ఏంటనే చర్చ మొదలైంది. చట్ట సవరణతో ప్రభుత్వ ఆదాయం పెంచుకోవచ్చని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చెబుతున్నారు. కార్పొరేట్ సేవల రిజిస్ట్రేషన్ ఫీజులు, స్టాంప్ డ్యూటీని పెంచడం, రియల్ ఎస్టేట్, వాణిజ్య ఒప్పందాలకు చట్టబద్ధత కల్పించడంతో అదనపు ఆదాయం సమకూరుతుంది. నకిలీ స్టాంప్ పేపర్లు, డూప్లికేట్లు, స్కామ్లకు అడ్డుకట్ట వేయొచ్చు.
News July 6, 2025
నెల్లూరులో రొట్టెల పండుగ.. తొలిరోజే జనం కిటకిట

నెల్లూరు నగరంలోని స్వర్ణాల చెరువు దగ్గర బారాషహీద్ దర్గాలో సోమవారం రొట్టెల పండుగ ఘనంగా ప్రారంభమైంది. ఇవాళ తెల్లవారుజాము నుంచి భక్తులు పలు రాష్ట్రాల నుంచి రొట్టెల పండుగ ప్రాంగణానికి విచ్చేశారు. స్వర్ణాల చెరువులో కోర్కెలు తీర్చే విధంగా భక్తులు రొట్టెలు పంచుకుంటున్నారు. ప్రారంభమైన తొలిరోజే భక్తుల తాకిడి ఎక్కువైంది. క్యూలైన్ల అన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.