News August 3, 2024

MNCL: ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లో తగ్గిన నీటిమట్టం

image

ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లో గడిచిన నాలుగు రోజుల్లో మూడు టీఎంసీల నీటి మట్టం తగ్గింది. వర్షాలు లేక ఎగువ ప్రాంతాల నుంచి వరద నిలిచిపోగా ప్రాజెక్ట్ నీటిని నంది పంప్ హౌస్‌కు తరలిస్తుండటంతో నీటి మట్టం తగ్గింది. ప్రాజెక్ట్ నీటిమట్టం 148 మీటర్లు కాగా.. ప్రస్తుతం 146.40 మీటర్లకు చేరింది. 20.175 టీఎంసీలకు గాను 15.900 టీఎంసీలుగా ఉంది. 3,600 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది.

Similar News

News December 29, 2025

38 ఫిర్యాదులు నమోదు: ADB ఎస్పీ

image

సోమవారం పోలీసు ముఖ్య కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 38 దరఖాస్తులు వచ్చినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. వాటి పరిష్కారానికి సంబంధించిన అధికారులకు ఆదేశాలిచ్చారు. బాధితుల సమస్యల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ఆయనతో పాటు శిక్షణ ఐపీఎస్ రాహుల్ పంత్, సీసీ కొండరాజు, కవిత, వామన్ ఉన్నారు.

News December 25, 2025

ADB: ఆన్లైన్ గేమ్లకు బానిస.. కుమారుడిపై తల్లి ఫిర్యాదు

image

ఆన్లైన్ గేమ్లకు బానిసగా మారిన తన కుమారుడిపై తల్లి ఆదిలాబాద్ టూటౌన్‌లో బుధవారం ఫిర్యాదు చేసినట్లు ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు. షేక్ సోహెల్ ఆన్లైన్లో ఆటలు ఆడుతూ డబ్బులు పోగొట్టుకోవడంతో పాటు తరచూ డబ్బులివ్వాలని తల్లిని, భార్యను శారీరకంగా వేధింపులకు గురి చేస్తున్నట్లు విద్యానగర్‌లో ఉండే సామెరా బీ ఫిర్యాదు చేసిందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.

News December 24, 2025

ADB: 27న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ క్రాస్ కంట్రీ ఎంపికలు

image

ఈ నెల 27న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ క్రాస్ కంట్రీ ఎంపిక పోటీలు అండర్-16,18, 20 బాల బాలికలకు, మెన్ అండ్ ఉమెన్స్‌కి వేరువేరుగా ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు అథ్లెటిక్స్ అధ్యక్షుడు బోజా రెడ్డి తెలిపారు. ప్రతిభ గల క్రీడాకారులను ఎంపిక చేసి జనవరి 2న హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. అర్హులైన, ఆసక్తిగల క్రీడాకారులు పాల్గొనాలని కోరారు.