News April 10, 2025
MNCL: కారు నడుపుతుండగా గుండెపోటు.. మృతి

విధి నిర్వహణలో సింగరేణి కాంట్రాక్టు కార్మికుడు గుండెపోటుతో మృతి చెందిన ఘటన గురువారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో చోటుచేసుకుంది. ఏరియాలో ఎస్ఆర్పీ 3 గని మేనేజర్ వద్ద కాంట్రాక్టు వెహికల్ డ్రైవర్గా పనిచేస్తున్న కోటేశ్ విధి నిర్వహణలో వాహనం నడుపుతుండగా గుండెపోటుతో మరణించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News April 18, 2025
వాట్సాప్లో కొత్త ఫీచర్

ఆండ్రాయిడ్ యూజర్లకు వాట్సాప్లో ‘Quality for downloaded photos and videos’ ఫీచర్ రానుంది. దీని ద్వారా మీడియా ఫైల్స్ను నచ్చిన క్వాలిటీలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్టాండర్డ్ లేదా హై క్వాలిటీ ఆప్షన్లలో నచ్చిన దానిని ఎంచుకోవాలి. మీరు స్టాండర్డ్ క్వాలిటీ పెట్టుకుంటే అవతలి వ్యక్తి HDలో పంపినా మీకు స్టాండర్డ్ క్వాలిటీలోనే ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. తద్వారా డేటా సేవ్ అవుతుంది. డౌన్లోడ్ స్పీడూ పెరుగుతుంది.
News April 18, 2025
నెల్లూరులోనూ వెయ్యేళ్ల నాటి కట్టడాలు

నెల్లూరులోని తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానం అతి పురాతనమైంది. దీనిని క్రీ.శ 7, 8వ శతాబ్దంలోనే సింహపురిని ఏలిన పల్లవ రాజులు దీనిని నిర్మించారు. ఆ తర్వాత రాజరాజనరేంద్రుడు, కుళోత్తుంగ చోళుడు దీనిని అభివృద్ధి చేశారు. 95 అడుగుల పొడవుతో ఆలయ గాలిగోపురం ఉండటం విశేషం. అలాగే ఉదయగిరి కోటకు వెయ్యేళ్ల చరిత్ర ఉంది. ఇలాంటి కట్టడాలు నెల్లూరు జిల్లాలో చాలా ఉన్నాయి. నేడు World Heritage Day.
News April 18, 2025
పిల్లలను నరికి చంపి తల్లి ఆత్మహత్య.. కారణమిదేనా?

TG: నిన్న మేడ్చల్ (D) గాజులరామారంలో ఓ తల్లి ఇద్దరు పిల్లలను నరికి చంపి ఆత్మహత్య చేసుకున్న కేసులో కీలక విషయాలు తెలిశాయి. ఆశిష్(7), హర్షిత్(4)కి శ్వాసకోశ సమస్యలు ఉండటంతో ప్రతి 3, 4 గంటలకు ఒకసారి డ్రాప్స్ వేయాలి. దీంతో తేజస్విని మానసికంగా కుంగిపోయినట్లు సమాచారం. ‘మెరుగైన వైద్యానికి భర్త సహకరించట్లేదు. ఎంత ఆస్తి ఉన్నా పిల్లలకు పనికిరాకుండా పోతోంది. భర్త కోపంతో కసురుకుంటాడు’ అని సూసైడ్ నోట్ రాసింది.