News August 13, 2024

MNCL: గోదావరి నదిపై వంతెన నిర్మాణం ప్రారంభించాలని నిరసన

image

మంచిర్యాల- అంతర్గాం మధ్య గోదావరి నదిపై గతంలో ప్రతిపాదించిన స్థలంలో వెంటనే వంతెన నిర్మాణ పనులు ప్రారంభించాలని మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు వంగపల్లి వెంకటేశ్వర్ రావు గారు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తన స్వలాభం కోసం మరో ప్రాంతంలో బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు.

Similar News

News November 9, 2025

ఆదిలాబాద్: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఇవే

image

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఆదిలాబాద్, భీంపూర్, ఇచ్చోడ, నేరడిగొండ, బోథ్, ఇంద్రవెల్లి, నార్నూర్ ప్రాంతాల్లో ప్రారంభించనున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. సోయాబీన్ కొనుగోలు కేంద్రాలు ఆదిలాబాద్, జైనాథ్, బేల, భీంపూర్, ఇచ్చోడ, నేరడిగొండ, బోథ్, ఇంద్రవెల్లి, ఉట్నూర్, నార్నూర్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ చెప్పారు. నాణ్యతా ప్రమాణాలను మించిన పంటను కొనుగోలు చేయబడదని స్పష్టం చేశారు.

News November 9, 2025

మొక్కజొన్న, సోయాబీన్‌కు మద్దతు ధరతో కొనుగోలు: ADB కలెక్టర్

image

ఆదిలాబాద్ జిల్లా రైతుల కోసం మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్న, సోయాబీన్ పంటలను మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నట్లు కలెక్టర్ రాజార్షి షా తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నాణ్యతా ప్రమాణాలను మించిన పంటను కొనుగోలు చేయబడదని స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాల వివరాలు, సందేహాల కోసం రైతులు 6300001597ను సంప్రదించాలన్నారు.

News November 9, 2025

రాష్ట్రస్థాయి పోటీలో ఫైనల్‌కు ADB జట్టు

image

నారాయణపేటలో జరుగుతున్న ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ అండర్-17 బాలికల విభాగంలో ఆదిలాబాద్ జిల్లా జట్టు ఫైనల్‌కు చేరింది. సెమి ఫైనల్ మ్యాచ్‌లో కరీంనగర్ జట్టుపై ఆదిలాబాద్ జట్టు విజయం సాధించింది. ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్‌లలో జిల్లా జట్టు అద్భుత ప్రదర్శన కనబరుస్తూ.. ఘన విజయాలను నమోదు చేసినట్లు జిల్లా ఎస్జీఎఫ్ సెక్రటరీ రామేశ్వర్ తెలిపారు. జిల్లా జట్టుకు DEO రాజేశ్వర్ అభినందనలు తెలిపారు.