News August 17, 2025

MNCL: జిల్లాలో 54.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు

image

మంచిర్యాల జిల్లాలో గడిచిన 24 గంటల్లో 54.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కన్నెపల్లి మండలంలో 135.8 సెంటీమీటర్లు.. అత్యల్పంగా చెన్నూర్ లో 8.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. భీమినిలో 122.6, నెన్నెలలో 89.6, హాజీపూర్ లో 79.8, మంచిర్యాలలో 76.4, జైపూర్ లో 72.6, నస్పూర్ లో 62, తాండూరులో 68.2, కోటపల్లిలో 24.6, బెల్లంపల్లిలో 37.4, లక్షెట్టిపేటలో 35 సెంటీమీటర్ల వర్షం పడింది.

Similar News

News August 17, 2025

సమస్య ఉంటే ఫోన్ చెయ్యండి: విశాఖ మేయర్

image

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నగరవాసులకు ఎటువంటి ఇబ్బందులు వచ్చిన నేరుగా తనకు తెలియజేయాలని మేయర్ పీలా శ్రీనివాసరావు కోరారు. గ్రేటర్ పరిధిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ముఖ్యంగా లోతట్టు, కొండవాలు, తీర ప్రాంత ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా 99668 29999 నంబరుకు వెంటనే సంప్రదించాలని సూచించారు.

News August 17, 2025

పల్లాను కలిసిన నావల్ డాక్ యార్డ్ అప్రెంటిస్ అభ్యర్థులు

image

గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును నావల్ డాక్ యార్డ్ అప్రెంటిస్ అభ్యర్థులు ఆదివారం ఆయన కార్యాలయంలో కలిశారు. ఇటీవల విడుదల చేసిన నావల్ డాక్ యార్డ్ రిక్రూట్మెంట్‌లో వయసు సరిపడక చాలామంది అభ్యర్థులు నష్టపోతున్నారని వినతి అందజేశారు. డాక్ యార్డ్‌లో అప్రెంటిషిప్ చేసిన అభ్యర్థులకు వయసు సడలింపు కల్పించేలా అధికారులతో సంప్రదింపులు జరపాలని కోరారు. పల్లాను కలిసిన వారిలో 150మంది అభ్యర్థులు ఉన్నారు.

News August 17, 2025

సంగారెడ్డి: 22 నుంచి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు

image

సంగారెడ్డి జిల్లాలో ఈనెల 22 నుంచి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు జరుగుతాయని డీఈవో వెంకటేశ్వర్లు ఆదివారం తెలిపారు. 22, 23 తేదీల్లో ప్రాథమిక పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు 50% చొప్పున హాజరుకావాలని పేర్కొన్నారు. 29న ఉన్నత పాఠశాలలో పనిచేసే లాంగ్వేజ్, 30న నాన్ లాంగ్వేజ్ ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు.